Asianet News TeluguAsianet News Telugu

మరోసారి కలుస్తున్న ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌.. షూటింగ్‌ ఎప్పట్నుంచంటే?

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `అరవింద సమేత` మూవీ వచ్చింది. మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రావాల్సింది, కానీ సెట్‌ కాలేదు. ఇప్పుడు ఈ ఇద్దరు మరోసారి కలుస్తున్నారనే వార్త వైరల్‌ అవుతుంది.

ntr trivikram collaborating once again shooting and full details arj
Author
First Published Apr 26, 2023, 9:51 PM IST

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో `అరవింద సమేత వీర రాఘవ` చిత్రం వచ్చింది. రాయలసీమ ఫ్యాక్షన్‌ నేపథ్యంలో ఆ ఫ్యాక్షన్‌లో చంపుకున్న తర్వాత అక్కడి ఫ్యామిలీస్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ ఫ్యాక్షన్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టి, అభివృద్ధి వైపు అడుగులు వేయాలనే లక్ష్యంతో హీరో పాత్ర ప్రధానంగా సాగే ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కానీ బ్లాక్‌ బస్టర్‌ రేంజ్‌కి చేరుకోలేదు. ఆ తర్వాత మరోసారి వీరి కాంబినేషన్‌లో సినిమాని ప్రకటించారు. త్రివిక్రమ్‌ `అల వైకుంఠపురములో` చిత్రం తర్వాత ఎన్టీఆర్‌తోనే సినిమా చేయాల్సింది. దీన్ని అధికారికంగానూ ప్రకటించారు. 

కానీ కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఈ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. ఎన్టీఆర్‌.. కొరటాలకి కమిట్‌ కావడం, త్రివిక్రమ్‌ మహేష్‌బాబుతో కమిట్‌ అయ్యారు. అలా ఎన్టీఆర్‌,త్రివిక్రమ్‌ సినిమా బ్యాక్‌ అయ్యింది. మళ్లీ ఉంటుందనే వార్తలొచ్చాయి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యేలా లేదు. కానీ అనూహ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్‌ సెట్‌ అయ్యిందనే వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతుంది. అంతేకాదు ఏకంగా షూటింగ్‌ లో కూడా పాల్గొనబోతున్నారట. అదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

అయితే ఇది సినిమా కోసం కాదు, ఓ కమర్షియల్‌ యాడ్‌ కోసం ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారట. ఎన్టీఆర్‌ ఓ కమర్షియల్‌ యాడ్‌ చేస్తున్నారు. దీనికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్నారట. ఇది రేపు గురువారం షూటింగ్‌ జరుగుతుందని తెలుస్తుంది. గురువారం కాని, మరో రెండు మూడు రోజుల్లోగానీ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌ యాడ్‌ షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని నెట్టింట ఓ వార్త వైరల్‌ అవుతుంది. మరి దీంట్లో నిజం ఎంతా అనేది చూడాలి. కానీ ఇది ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. 

ప్రస్తుతం తారక్‌.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. `ఎన్టీఆర్‌30` వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ఎన్టీఆర్‌తోపాటు జాన్వీ కపూర్‌ కూడా పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. దీనికోసం ఓ భారీ సెట్‌ కూడా వేశారని టాక్. మరోవైపు త్రివిక్రమ్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో `ఎస్ఎస్‌ఎంబీ28` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీలా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇది కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. యాడ్‌ కోసం అటు తారక్‌, ఇటు త్రివిక్రమ్‌ షూటింగ్‌ నుంచి గ్యాప్‌ తీసుకుంటున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios