ఫ్యామిలీ, ఇండస్ట్రీ ప్రముఖుల కంటే ఫ్యాన్స్ కే ప్రయారిటీ ఇచ్చిన ఎన్టీఆర్..బర్త్ డే విషెస్పై ట్వీట్
ఎన్టీఆర్కి బర్త్ డే విషెస్లు, సహాయాలు, కొత్త సినిమాల అప్డేట్లతో సోషల్ మీడియా మారుమోగింది. ఈ రోజు ట్విట్టర్ని ఎన్టీఆర్ ఏలేశారు. అభిమానులు ఇంతగా ప్రేమాభిమానాలు చాటడంతో ఎన్టీఆర్ స్పందించారు.
ఎన్టీఆర్ తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. తన పుట్టిన రోజుని పురస్కరించుకుని తమ అపారమైన ప్రేమని కనబరిచిన ప్రతి ఒక్కరికి ఆయన థ్యాంక్స్ చెప్పారు. నేడు(మే 20) యంగ్ టైగర్ తన 38వ పుట్టిన రోజుని జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో బర్త్ డే వేడుకలకు దూరంగా ఉన్నారు. అలాగే అభిమానులు కూడా దూరంగా ఉండాలని, కరోనాతో బాధపడుతున్న వారికి సహాయం చేయాలని తెలిపారు. దీంతో ఆయన అభిమానులు దీన స్థితిలో ఉన్న వారికి సహాయం చేశారు. కొందరు అన్నదానం చేయగా, మరికొందరు కరోనా పేషెంట్లకి సంబంధించి ఆసుపత్రి, వైద్యం, ఆక్సిజన్, బెడ్స్ వంటివి అందించే ప్రయత్నం చేశారు.
మొత్తంగా ఎన్టీఆర్కి బర్త్ డే విషెస్లు, సహాయాలు, కొత్త సినిమాల అప్డేట్లతో సోషల్ మీడియా మారుమోగింది. ఈ రోజు ట్విట్టర్ని ఎన్టీఆర్ ఏలేశారు. అభిమానులు ఇంతగా ప్రేమాభిమానాలు చాటడంతో ఎన్టీఆర్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. `నిండు మనసుతో నాకు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, చిత్ర పరిశ్రమ సభ్యులకు పేరు పేరునా కృతజ్ఞతలు` అని తెలిపారు. అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఇందులో ఎన్టీఆర్ తన కుటుంబం, సినిమా ప్రముఖుల కంటే ముందు అభిమానులకే ప్రయారిటీ ఇవ్వడం విశేషం.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్కి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్టు రెండు రోజుల క్రితం తెలిపారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` చిత్రంలో నటస్తున్నారు. కొమురంభీమ్గా ఇందులో ఆయన కనిపించనున్నారు. దీనికి సంబంధించిన లుక్ విడుదలై ఆకట్టుకుంటోంది. అలాగే కొరటాల శివతో తన 30వ సినిమాని, `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్తో తన 31వ సినిమాని చేయబోతున్నట్టు ప్రకటించారు.