సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మార్చి 22న రాబోతున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాపై అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మార్చి 22న రాబోతున్న ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలుపెట్టారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సినిమాకు సంబంధించిన ట్రైలర్ లు, వీడియో సాంగ్స్ ఇలా ఒక్కొక్కటి విడుదల చేస్తూ క్యూరియాసిటీ పెంచేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ సందేశం పేరుతో దర్శకుడు వర్మ మరో వీడియో విడుదల చేశారు.

''ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబు నాయుడు తనను ఎలా వెన్నుపోటు పొడిచారో చెప్పారు'' అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం ఆధారంగా అప్పటి ఎన్టీఆర్ వ్యాఖ్యలను వీడియో రూపంలో విడుదల చేశారు వర్మ. 'చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నాకు కాదూ.. నాకు అధికారం ఇచ్చిన మీకు.. నాకు ఓటేసిన ప్రజలకు' అంటూ ఆ వీడియోలో ఎన్టీఆర్ ఎంతో ఆవేదనతో ప్రజలకు చెబుతుంటాడు.

'చంద్రబాబు గాడ్సే కన్నా అధముడు' అంటూ ప్రజాస్వామ్యం ఎవరికీ ఓటేస్తే బాగుంటుందో వారికే ఓటేయాలని సూచించారు.

Scroll to load tweet…