ఎన్టీఆర్ రాఖీ సినిమాకు సీక్వెల్, డైరెక్టర్ కృష్ణ వంశీ ఏమన్నారంటే..?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో.. కొన్ని సినిమాలకు సీక్వెల్స్ కావాలంటూ పట్టుపడుతున్నారు. ఆ లిస్ట్ లో రాఖీ మూవీ కూడా ఉంది. అప్పట్లో సంచలనంగా మారిన ఈసినిమాకుసీక్వెల్ కావాలని డైరెక్టర్ కృష్ణవంశీని అడిగితే.. ఆయన ఏమన్నారో తెలుసా..?
![NTR Rakhi Movie Sequel News Director Krishna Vamsi Clarity JMS NTR Rakhi Movie Sequel News Director Krishna Vamsi Clarity JMS](https://static-ai.asianetnews.com/images/01hk6vqrn42587r5jwvx7xqcj3/1-jpg_363x203xt.jpg)
కొన్ని కొన్ని సినమాలను సీక్వెల్స్ పేరుతో టచ్ చేయకూడదు. అసలు ఆ ఆలోచనలే రాకూడని సినిమాలు కొన్ని ఉన్నాయి. అందులో ఎన్టీఆర్ ఎమోషనల్ సెంటిమెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ రాఖీ కూడా ఒకటి. ఈ మూవీకి సీక్వెల్ కావాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్ అడుగుతున్నారు. అయితే చంద్రముఖిలాంటి సినిమాలకు సీక్వెల్స్ చేసి.. అనవసరంగా వాటి విలుకు పోగొట్టారు. ఇప్పుడు ఇంకొన్నిసినిమాలకు సీక్వెల్స్ కావాలంటూ డిమాండ్లు పెరుగున్నాయి.
ఇక రాఖీ సినిమాను డైరెక్ట్ చేసిన కృష్ణవంశీ ఈవిషయంలో స్పందించారు. కృష్ణ వంశీ ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. నిన్నే పెళ్ళాడుతా, సింధూరం, ఖడ్గం, రాఖీ, మహాత్మ, ఇలా చెప్పుకుంటూ పోతే సెన్సేషన్ క్రియేట్ చేసినసినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ నుంచి ఈనిమాలకు డీమేక్ డిమాండ్ ఉంది. ఈవిషయంలో కృష్ణ వంశీని కదిలించారు ఫ్యాన్స్. ఆయనతో సోషల్ మీడియా చిట్ చాట్ లో ఈ విషయాలు అడిగారు.
కృష్ణ వంశీ సినిమాలు ప్రస్తుతం జనాలకు ఎక్కడం లేదు. సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడి సినిమాలు ఇప్పుడు నడవడంలేదు. అయితే ఆయనన సోషల్ మీడియాలో కూడా చాలా తక్కువగా పార్టిస్పటే చేస్తుంటారు. అప్పుడప్పుడు మాత్రంమే అలా తొంగి చూస్తుంటారు. తాజాగా కృష్ణ వంశీ నెటింట్లో చిట్ చాట్ నిర్వహించారు.అందులో మీరు మంచిహిట్స్ ఇవ్వాలి.. నిన్నే పెళ్లాడతా లాంటిసినిమాలు మళ్లీ చేయండి అంటూ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. చిన్న సెటైరు వేశాడు. ఇలాంటి సినిమాలు ఇంకా చూస్తున్నారా...? అని రివర్స్ ప్రశ్న వేశాడు.
ప్రస్తతం సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది కదా.. మీ సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ అయినా చెయ్యోచ్చుకదా అని అడిగారు. ముఖ్యంగా రాఖీ సినిమాకు సీక్వెల్ కావాలంటూ రిక్వెస్ట్ చేశారు. దానికి సమాధానం ఇస్తూ.. సీక్వెల్స్ అంటే తనకు ఇష్టం ఉండదని చెప్పారు సీనియర్ దర్శకుడు. అంతే కాదు తనకు సీక్వెల్స్ తీయడం రాదని.. తన సినిమాలు అలా ఉంటేనే బాగుంటాయి అన్నారు. ఇక రాఖీ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. కష్టం అండీ.. రాఖీ లాంటి సినిమాను మరొకటి తియ్యలేం... అదో అద్భుతం.. అదృష్టం. అలాంటిది ఇంకొకటి తీసుకురాలేం.. అని అన్నారు. ప్రస్తుతం కృష్ణవంశీ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.