Asianet News TeluguAsianet News Telugu

కొరటాల శివతో ఎన్టీఆర్‌30.. ఫ్యాన్స్ ని యంగ్‌టైగర్‌ ఉగాది ట్రీట్‌, బిగ్‌ షాక్‌

ఎన్టీఆర్‌ హీరోగా తన 30వ చిత్రాన్ని ప్రకటించారు. ఉగాది పండుగని పురస్కరించుకున్న తాను నటించబోతున్న కొత్త సినిమా వివరాలను వెల్లడించారు. తనకి `జనతా గ్యారేజ్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని అందించిన కొరటాల శివతో సినిమాని చేయబోతున్నట్టు వెల్లడించారు. 

ntr next with koratala siva official announced arj
Author
Hyderabad, First Published Apr 12, 2021, 7:38 PM IST

ఎన్టీఆర్‌ హీరోగా తన 30వ చిత్రాన్ని ప్రకటించారు. ఉగాది పండుగని పురస్కరించుకున్న తాను నటించబోతున్న కొత్త సినిమా వివరాలను వెల్లడించారు. తనకి `జనతా గ్యారేజ్‌` వంటి సూపర్‌ హిట్‌ చిత్రాన్ని అందించిన కొరటాల శివతో సినిమాని చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాని సోమవారం సాయంత్రం వెల్లడించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ నందమూరి కళ్యాణ్‌ రామ్‌ సమర్పణలో యువసుధా ఆర్ట్స్ పతాకంపై సుధాకర్‌ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీని కూడా ఇప్పుడే ప్రకటించడం విశేషం. ఈ సినిమాని జూన్‌ సెకాండాఫ్‌లో ప్రారంభించి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 29న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. 

తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన నెక్ట్స్ సినిమాని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతుందట. అయితే ఈ సారి `నేషనల్‌ స్థాయిలో రిపేర్లు చేయబడును` అని క్యాప్షన్‌ పెట్టడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన సామాజిక చిత్రం `జనతా గ్యారేజ్‌`లో `ఇచట అన్ని రకాల రిపేర్లు చేయబడును` అని పెట్టారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో రిపేర్లు చేయబడును అని చెప్పడం ఆసక్తిని, సస్పెన్స్ ని క్రియేట్‌ చేస్తుంది. అంటే ఇది `జనతా గ్యారేజ్‌`కి సీక్వెల్‌గా ఉంటుందా? లేక పాన్‌ ఇండియా లెవల్‌లో ఉంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఎన్టీఆర్‌, కొరటాల కాంబినేషన్‌లో సినిమా మరింత క్రేజ్‌ని సొంతం చేసుకుంది. 

ప్రస్తుతం ఎన్టీఆర్‌ `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్‌ సరసన బ్రిటీష్‌ నటి ఒలివియా మోర్రీస్‌, చరణ్‌ సరసన అలియా భట్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్‌ 13న విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ తన `ఎన్టీఆర్‌30`ని గతంలో త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ప్రకటించారు. ఇప్పుడు ఆ సినిమా ప్లేజ్‌లో కొరటాల రావడం గమనార్హం. దీంతో అభిమానులు షాక్‌కి గురవుతున్నారు. అయితే ఇది కొరటాల తర్వాత ఉంటుందా? లేక ఆగిపోయిందా? అన్నది సస్పెన్స్ గా మారింది.

ప్రస్తుతం కొరటాల.. చిరంజీవితో `ఆచార్య` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామ్‌చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో కాజల్‌ కథానాయికగా నటిస్తుంది. పూజా హెగ్డే.. చరణ్‌ సరసన కనిపించనుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై నిరంజన్‌రెడ్డి, రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయనున్నారు. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే కొరటాల తన నెక్ట్స్ సినిమాని బన్నీతో ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా విషయంలోనూ సస్సెన్స్ నెలకొంది.

Follow Us:
Download App:
  • android
  • ios