అది ఫేక్ న్యూస్ : 5 కోట్ల కారు కొన్న ఎన్టీఆర్,మేనేజర్ క్లారిటీ!
జూనియర్ ఆ కారును తొలిసారి డ్రైవ్ చేసుకుంటూ రామ్ చరణ్ ఇంటికి వెళ్లాడని వార్తలు తెగ వైరల్గా మారాయి.
తాజాగా హీరో జూనియర్ ఎన్టీఆర్ రూ. 5 కోట్ల విలువైన ఓ కారును కోనుగోలు చేశారని వార్తలు వచ్చాయి. దాదాపు అన్ని మీడియా సంస్దలు దాన్ని కవర్ చేసాయి. ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వార్త అక్కడితో ఆగకుండా జూనియర్ ఆ కారును తొలిసారి డ్రైవ్ చేసుకుంటూ రామ్ చరణ్ ఇంటికి వెళ్లాడని వార్తలు తెగ వైరల్గా మారాయి. ఇందులో భాగంగా ఓ లగ్జరీ కారు ఫొటో నెట్టింట హల్చల్ చేసింది. ఈ విషయమై ఎన్టీఆర్ మేనేజర్ మహేష్ కోనేరు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మహేష్ కోనేరు చెప్పేదాని ప్రకారం.. ఎన్టీఆర్ కొత్త కారును కొనుగోలు చేయలేదు. రామ్ చరణ్ ఇంటి ముందు ఉన్నది ఎన్టీఆర్ కారేనని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. కానీ ఇందులో ఏమాత్రం నిజంలేదని తేల్చి చెప్పారు. దీంతో నెట్టింట వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ కొత్త కారు వార్తలు పూర్తిగా అవాస్తవమని తేలింది. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతానికి కొత్త కారును కొనుగోలు చేయకపోయినా.. ఇప్పటికే ఓ కారును బుక్ చేసుకున్నాడని మేనేజర్ తెలిపారు.
ఎన్టీఆర్ కొన్నాళ్ల క్రితమే లంబోర్గిని ఉరుస్ మోడల్ను బుక్ చేసుకున్నారని తెలిపారు. ఈ కారు ఇటలీ నుంచి భారత్కు రావాల్సి ఉండగా డెలివరీకి మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని మహేష్ క్లారిటీ ఇచ్చారు. అలా ఎన్టీఆర్ కొత్త కారు వార్తల వెనక ఉన్న అసలు కథ అని తేల్చేసారు. లంబోర్ఘిని ఉరుస్ గంటకు 305 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇది 3.6 సెకన్లలో సున్నా నుండి 100కి చేరుకుంటుంది. లంబోర్ఘిని ఉరుస్ కోసం ఎన్టీఆర్ ఆర్డర్ చేశారట.
ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహించిన “ఆర్ఆర్ఆర్”లో కనిపించనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. అయితే ఈ ముగ్గురి కాంబోలో వస్తున్న మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్తో సినిమాపై అంచనాలు భారీగా ఉండగా.. ఇటీవల విడుదల చేసిన మేకింగ్ వీడియోతో.. సినిమా పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ఇక జక్కన్న కూడా అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే సినిమాను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.