ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మరో వారసుడు ఎంట్రీ ఇస్తున్నాడు. నందమూరి వారసుడిగా ఇండస్ట్రీని ఏలుతున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆయన బావమరిది నార్నే నితిన్ చంద్ర హీరోగా మారాడు.
తెలుగు పిల్మ్ ఇండస్ట్రీలో వారసులకు కొదవ లేదు. తాతలు, తండ్రుల వారసత్వాన్ని తీసుకుని ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు చాల మంది ఉన్నారు. అయితే అందులో చాలా మంది స్టార్ స్టేటస్ అందుకోగా.. మరికొంత మంది మాత్రం ఎంత ప్రయత్నం చేసినాస్టార్ డమ్ తెచ్చుకోలేకపోయారు. అయినా సరే ఇండస్ట్రీలోకి వారసత్వం ప్రవాహంలా వస్తూనే ఉంది. ఇక ఇఫ్పుడు ఎన్టీఆర్ తరపు నుంచి ఆయన బావుమరిది నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
ఎన్టీఆర్ నందమూరి వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాన్ ఇండియా స్టార్ స్థాయికి ఎదిగాడు.సీనియర్ ఎన్టీఆర తరువాత బాలయ్య.. ఆయన తరువాత జూనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని నిలబెట్టారు. నందమూడి కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చినా తారక్ అంతలా స్టార్ డమ్ ను మాత్రం ఇంకెవరు అందుకోలేకపోయారు.
ఇక ఇఫ్పుడు ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన ఎంట్రీకి సంబంధించిన వార్తలు లాస్ట్ ఇయర్ నుంచీ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే కరోనా ప్రభావం వలన ఈ సినిమాకి సంబధించి ఎటువంటి అప్ డేట్ ఇవ్వలేదు. అటు ఫస్టులుక్ పోస్టర్ బయటికి రావడానికి కూడా ఆలస్యమైంది.
ఇక రీసెంట్ ఈ సినిమాకి శ్రీ శ్రీ శ్రీ రాజావారు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పొస్టర్ ను కూడా రిలీజ్ చేశారు టీమ్. చింతపల్లి రామారావు - ఎమ్మెస్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి, టైటిల్ తో కూడిన నితిన్ చంద్ర ఫస్టులుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. జాతర నేపథ్యంలో నడుస్తూ .. సిగరెట్ వెలిగించే ఈ పోస్టర్ లో ఆయన మాస్ లుక్ తో రఫ్ గా కనిపిస్తున్నాడు. కైలాస్ మీనన్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇంతవరకూ ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కథలను తెరకెక్కిస్తూ వచ్చిన సతీశ్ వేగేశ్న, ఈ సారి ఇలాంటి ఒక మాస్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకున్నారు. పైగా ఈ సినిమా టైటిల్ సిగరెట్లతో రాసుండటం విశేషం. అయితే ఈ సినిమాలో హీరోయిన్. విలన్ తో పాటు ఇతర నటీనటుల వివరాలను త్వరలో వెల్లడించబోతున్నట్టు తెలుస్తోంది.