యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ కళ్యాణ్ రామ్ నిర్మాతగా తెరకెక్కుతున్న జై లవకుశ త్వరలోనే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్స్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రంగా బాబీ దర్శకత్వంలో 'జై లవ కుశ' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేయనున్నట్టుగా వార్తలు వచ్చిన దగ్గర నుంచి, ఈ సినిమా ఫస్టులుక్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ మూడు గెటప్స్ ను మిక్స్ చేస్తూ బాబీ ఈ ఫస్టులుక్ ను స్పెషల్ గా డిజైన్ చేయించినట్టు చెబుతున్నారు. టైటిల్ లోగోను ఆవిష్కరించినప్పుడు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అంతకి మించి అన్నట్టుగా ఫస్టు లుక్ వుండేలా చూస్తున్నారు. ఫస్టులుక్ ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
