బుచ్చిబాబు సినిమా విషయంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ సందిగ్ధంలో పడ్డారట. ఆ కథ విషయంలో ఆయన చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారని, అదే సమయంలో అందులో చాలా రిస్క్ ఉందని తెలుస్తుంది. 

ఎన్టీఆర్‌(NTR) `ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR) నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. వెయ్యి కోట్ల కలెక్షన్లే టార్గెట్‌గా రన్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాలపై దృష్టి పెట్టారు. ఎన్టీఆర్‌ తన 30వ సినిమాని కొరటాల శివతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు `ఉప్పెన` ఫేమ్‌ బుచ్చిబాబు(Buchibabu)తోనూ ఓ సినిమా కమిట్‌మెంట్‌ ఉంది. దీనికి `పెద్ది`(Peddi) అనే టైటిల్‌ కూడా కన్ఫమ్‌ అయినట్టు సమాచారం. 

ఇదిలా ఉంటే బుచ్చిబాబు సినిమా విషయంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ సందిగ్ధంలో పడ్డారట. ఆ కథ విషయంలో ఆయన చాలా ఎగ్జైటెడ్‌గా ఉన్నారని, అదే సమయంలో అందులో చాలా రిస్క్ ఉందని తెలుస్తుంది. ఈ సినిమా 1980లో జరిగే పీరియాడికల్‌ స్పోర్ట్స్ డ్రామాగా తెలుస్తుంది. ఈ స్టోరీ తారక్‌కి బాగా నచ్చిందట. ఎలాగైనా చేయాలనే మూడ్‌లో ఉన్నారట. అందుకే కొరటాల శివ చిత్రంతోపాటు, బుచ్చిబాబు సినిమాని కూడా ఏక కాలంలో పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ జరుగుతుందని సమాచారం. 

అయితే ఈ సినిమాలో రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఉన్నాయని తెలుస్తుంది. ఇందులో కొన్ని సన్నివేశాల్లో ఎన్టీఆర్‌ దివ్యాంగుడిగా కనిపించాల్సి ఉందట. ఇదే ఇప్పుడు తారక్‌ని సందిగ్దంలో పెట్టింది. `ఆర్‌ఆర్‌ఆర్‌`తో పాన్‌ ఇండియా ఇమేజ్‌ పొందిన తారక్‌ ఇప్పుడు ఎక్స్ పర్‌మెంట్ చేస్తే ఫ్యాన్స్ రిసీవ్‌ చేసుకుంటారా? దివ్యాంగుడిగా అంగీకరిస్తారా? అనే డైలమాలో మొదలైందట. దీంతో ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారని ఫిల్మ్ నగర్‌ టాక్‌. కథలో ఆయా సన్నివేశాలు చాలా కీలకమని, వాటిని మార్చడానికి లేదని దర్శకుడి నుంచి వస్తోన్న వాదన. సో కచ్చితంగా చేయాల్సిందే. మరి ఈ రిస్క్ ని ఎన్టీఆర్‌ చేస్తారా? అనేది సస్పెన్స్ గా మారిందట. 

 `ఉప్పెన` చిత్రంలోనూ హీరోకి చివరల్లో లోపం పెట్టి హిట్‌ కొట్టారు బుచ్చిబాబు. అదే ఫార్మూలా ఎన్టీఆర్‌ సినిమాలోనూ వర్కౌట్‌ అవుతుందా? అనేది ప్రశ్నగా మారింది. వైష్ణవ్‌ తేజ్‌కి `ఉప్పెన` మొదటి సినిమా. దీంతో అది వర్కౌట్‌ అయ్యింది. మరి ఎన్టీఆర్‌కి వర్కౌట్‌ అవుతుందా? అనేది ఇప్పుడు టీమ్‌ని వేదిస్తున్న ప్రశ్న. మరి ఈ విషయంలో తారక్‌ సాహసం చేస్తాడా? మొండిగా రంగంలోకి దిగుతాడా? వెనకడుగు వేస్తాడా? అనేది ఆసక్తికరంగా మారిందట. ఈ వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.