ఎన్టీఆర్ కళాపరిషత్ పేరిట ఏర్పాటు చేసిన లెజండరీ ఎన్టీఆర్ అవార్డుని సినీదర్శకుడు క్రిష్ కి అందజేయనున్నారని తెలుస్తోంది. కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రతిఏటా రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. 

ఎన్టీఆర్ కళాపరిషత్ పేరిట ఏర్పాటు చేసిన లెజండరీ ఎన్టీఆర్ అవార్డుని సినీదర్శకుడు క్రిష్ కి అందజేయనున్నారని తెలుస్తోంది. కళాపరిషత్ ఆధ్వర్యంలో ప్రతిఏటా రాష్ట్రస్థాయి నాటిక పోటీలు నిర్వహిస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ ఏడాదికి అవార్డుని ఈ నెల 30న జరిగే సభలో క్రిష్ కి ప్రధానం చేయనున్నారు. 'గమ్యం' సినిమాతో 2008లో సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యారు క్రిష్. మొదటి సినిమాతో బెస్ట్ డైరెక్టర్ అవార్డుని అందుకున్నాడు.

వేదం, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సినిమాలు ఆయన దర్శకత్వ ప్రతిభకి నిదర్శనం. ఆయన ప్రతిభని గుర్తించి కళాపరిషత్ ఎన్టీఆర్ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రస్తుతం క్రిష్ 'ఎన్టీఆర్' బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో మొదటి భాగం ఫిబ్రవరిలో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.