Asianet News TeluguAsianet News Telugu

NTR: త్వరగా కోలుకోండి మావయ్యా...బాబుని ఉద్దేశిస్తూ ఎన్టీఆర్ ట్వీట్.. సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ!

ఎన్టీఆర్ చంద్రబాబు కోలుకోవాలంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ తన ట్వీట్ లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని విష్ చేశారు. 

ntr a wishes tdp president nara chandrababu naidu an interesting debate going on
Author
Hyderabad, First Published Jan 18, 2022, 7:58 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu) కరోనా బారినపడ్డారు. నేడు ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ సమాచారం పంచుకున్నారు. తనకు కరోనా సోకిందని, క్వారంటైన్ కావడంతో పాటు ఇంట్లో వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అలాగే తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా ఉండాలని చంద్రబాబు నాయుడు కోరుకున్నారు. 

చంద్రబాబుకు కరోనా అని తెలుసుకున్న టీడీపీ (TDP)నాయకులు కార్యకర్తలు ఆయన కోలుకోవాలని కోరుకున్నారు. సోషల్ మీడియా ద్వారా బెస్ట్ విషెస్ తెలియజేశారు. కాగా ఎన్టీఆర్ చంద్రబాబు కోలుకోవాలంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ తన ట్వీట్ లో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ త్వరగా కోలుకోవాలని విష్ చేశారు. మామయ్య చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ మీరు త్వరగా కరోనా నుండి బయటపడాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. నారా లోకేష్ సైతం కరోనా బారిన పడగా ఇద్దరినీ ఒకేసారి విష్ చేశారు ఎన్టీఆర్. 

ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR)ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.  ఆ మధ్య భార్య భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని చంద్రబాబు మీడియా ముఖంగా కన్నీటి పర్యంతం అయ్యాడు. భువనేశ్వరి క్యారెక్టర్ అసాసినేషన్ ఎపిసోడ్ ఏపీలో కొన్ని రోజులు హాట్ టాపిక్ గా నడిచింది. 

ఈ విషయంలో చంద్రబాబుకు, భువనేశ్వరికి మద్దతుగా పలువురు మాట్లాడారు. ఎన్టీఆర్ సైతం దీన్ని ఖండించారు. ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, రాజకీయాల్లోకి లాగడం సరికాదన్న అభిప్రాయం వెల్లడించారు. అయితే ఎన్టీఆర్ స్పందించిన తీరు సరిగా లేదని టీడీపీ వర్గాలు ఆయన్ని టార్గెట్ చేశాయి. చిలికి చిలికి గాలివాన అయినట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్, టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో చాలా మందికి చంద్రబాబు అండ్ కో అంటే పీకలదాకా కోపం ఉంది. 

నేడు ఎన్టీఆర్ చంద్రబాబు కరోనా (Corona Virus)నుండి కోలుకోవాలని ఆయన ట్వీట్ చేయడంతో ఆసక్తికర చర్చ మొదలైంది. ఎన్టీఆర్ ట్వీట్ క్రింద కామెంట్స్ రూపంలో వాదోపవాదాలు నడుస్తున్నాయి. కాగా ఎన్టీఆర్ గత ఏడాది కరోనా బారిన పడ్డారు. అప్పుడు చంద్రబాబు ఎన్టీఆర్ కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు. నారా లోకేష్ కి కరోనా సోకినా స్పందించిందని ఎన్టీఆర్ అందుకే ప్రతిగా చంద్రబాబుని విష్ చేశారని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. 

చంద్రబాబు-ఎన్టీఆర్ కలిసిపోవాలి, ఇద్దరూ టీడీపీ పార్టీని అధికారంలోకి తీసుకురాలని ఆశపడేవారు ఈ పరిణామానికి సంతోషిస్తున్నారు. పార్టీకి దూరం పెట్టిన చంద్రబాబుని విష్ చేయడం ఏమిటని ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్ నొచ్చుకుంటున్నారు. ఎన్టీఆర్ అంటే గిట్టని టీడీపీ కార్యకర్తలు ఏదో మొహమాటం కోసం చేసిన ట్వీట్ గా అభివర్ణిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios