ఎన్టీఆర్ ఫ్యాన్స కు ఫస్ట్ లుక్ టైటిల్ తో.. సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు కొరటాల. ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్  ఎదురు చూస్తున్న టైమ్ రానే వచ్చింది.. ఎన్టీఆర్30 మూవీనుంచి సాలిడ్ అప్ డేట్ వచ్చేసింది. 

తారక్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టైమ్ రానే వచ్చింది. దేశ వ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ 30మూవీ టైటిల్ తో పాటు.. తారక్ పవర్ ఫుల్ లుక్ తో పోస్టర్ కూడా రిలీజ్ చేశారు టీమ్. రేపు (20 మే)ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈసినిమాకు దేవర టైటిల్ ను ప్రకటించిన టీమ్.. ఎన్టీఆర్ బ్లాక్ పంచె, బ్లాక్ షర్ట్,బ్లాక్ టవల్ తో.. రక్తంతో నిండిన ఆయుధం పట్టుకుని.. అలల మధ్య పవర్ ఫుల్ గా నిలుచున్న ఎన్టీఆర్ పోస్టర్ ను రిలీజ్ చేవారు టీమ్. ఈ అద్భుతమైన అప్ డేట్ నుచూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

 అంతే కాదు ఈమూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తారీకు 2024న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే..ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా పరుగెడుతోంది. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. అయినా సరే నెక్ట్స్ సమ్మర్ కు సినిమా రిలీజ్ ను ప్రకటించడమే ఫ్యాన్స్ కాస్త డిస్సపాయింట్ అయినా.. మూవీలో ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. 

Scroll to load tweet…

కొరటాల శివ దర్శకత్వంలో .. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అనౌన్స్ చేసిన రెండేళ్లకకు షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈసినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాు ఫ్యాన్స్. కాని సినిమా నెక్ట్స్ ఇయర్ రిలీజ్ ని తెలియడంతో.. ఈ ఏడాది థియేటర్ లో ఎన్టీఆర్ బొమ్మ లేనట్టే తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్... తరువాత చేస్తున్న సినిమా కావడంతో.. ఈమూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఎన్టీఆర్ గ్లోబల్ ఇమేజ్ తో.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని..కొరటాల శివ సాలిడ్ కథను తయారు చేసుకున్నాడు. చాలా గ్యాప్ తరువాత ఈసినిమా సెట్స్ పైకి వెళ్లింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ కూడా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేశారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈసినిమా కోసం పనిచేస్తున్నారు. మూడో షెడ్యూల్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీసెట్ మధ్య..ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. 

ఎన్టీఆర్ జోడీగా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా... తారక్ విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. తాజా షెడ్యూల్ లో ఆయన పాల్గొన్న ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈమూవీని యువసుధ ఆర్ట్స్ తో కలుపుకుని... ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. శ్రీకర ప్రసాద్ ఎడిటర్ గా సబు సిరిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.