షూటింగ్ ప్రారంభించిన నితిన్ `మ్యాస్ట్రో`.. మళ్లీ ఊపందుకుంటున్న షూటింగ్లు..
నితిన్ నటిస్తున్న `మ్యాస్ట్రో` చిత్ర షూటింగ్ని నేడు(సోమవారం) తిరిగి షూటింగ్ని ప్రారంభించారు. కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
నితిన్, తమన్నా, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `మ్యాస్ట్రో`. ఇది హిందీ సినిమా `అంధాధున్`కి రీమేక్. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ పతాకంపై ఎన్ సుధాకర్రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. కరోనా సెకండ్వేవ్ కారణంగా ఆగిపోయిన షూటింగ్లని మళ్లీ ప్రారంభిస్తున్నారు. నేడు(సోమవారం) తిరిగి షూటింగ్ని ప్రారంభించారు. కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ ఈ సినిమాని చిత్రీకరిస్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది.
`ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది. సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ రోజు హైదరాబాద్లో మొదలైంది. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్లో పాల్గొంటున్న హీరో నితిన్, అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత చిత్రీకరణను మొదలుపెట్టిన బిగ్ మూవీ కూడా `మ్యాస్ట్రో`నే కావడం విశేషం.
ఇప్పటికే నితిన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్లుక్, టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు నితిన్ హిట్ మూవీ `భీష్మ`కు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగరే. జె యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. వీటితోపాటు `ఆచార్య`, `పుష్ప`, `లైగర్` వంటి సినిమాలు షూటింగ్కి ప్లాన్ చేసుకుంటున్నాయి. అలాగే ఇప్పటికే కొన్ని చిన్న చిత్రాలు సైలెంట్గా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ షూటింగ్లు స్టార్ట్ చేసేందుకు మేకర్స్ అన్ని రకాలుగా సిద్ధమవుతున్నారు.