'మహర్షి' టీజర్ ఎలా ఉండబోతోందంటే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి . ఈ చిత్రం టీజర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం మహర్షి . ఈ చిత్రం టీజర్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఉగాది కానుకగా విడుదల కాబోతున్న ఈ టీజర్ ఎలా ఉండబోతోందనే చర్చ మీడియాలో ఇప్పటికే మొదలైపోయింది. ఈ టీజర్ వచ్చే రెస్పాన్స్ తో ఓవర్ సీస్ బిజినెస్ ని తాము అనుకున్న స్దాయిలో చేయాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దాంతో ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరీ టీజర్ కట్ చేసారని చెప్తున్నారు.
అందుతున్న సమాచారం మేరకు ఈ టీజర్ ని ఇప్పటికే కట్ చేసారని చెప్తున్నారు. మూడు టీజర్స్ కట్ చేసి వాటిలో ఒకటి ఎంచుకోమని మహేష్ కు ఇచ్చారని, ఆయన ఫైనల్ చేసిన వెర్షన్ ని విడుదల చేస్తారని తెలుస్తోంది. ఫైనల్ చేసిన టీజర ర్ కు సంభదించి రీరికార్డింగ్, డీటిఎస్ మిక్సింగ్ పూర్తి చేసి ముస్తాబు చేయబోతున్నారు.
ఈ టీజర్ లో మాస్ కు నచ్చే ఓ ఫైట్, ఎమోషనల్ గా సాగే రెండు డైలాగులు తో ఎండ్ చేయబోతున్నట్లు సమాచారం. టీజర్ ని అన్ని వర్గాలకు నచ్చేలా ఉండాలని, పూర్తిగా క్లాస్ గానూ , అటు మాస్ గానూ ఉండకూడదని దిల్ రాజు స్పష్టం చేసి దగ్గరుండి కట్ చేయించినట్లు చెప్తున్నారు.
మరో ప్రక్క మహర్షి సినిమాకు సంబంధించి హీరో మహేష్ బాబు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు.. ‘మహర్షి’ టాకీ పార్ట్ చివరిదశకు వచ్చేసిందని సమాచారం. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. మిగిలిన రెండు పాటల్లో ఒకదాన్ని హైదరాబాద్లో, రెండో పాటను దుబాయ్లో షూట్ చేస్తారని సమాచారం.
పివిపి, అశ్వనీదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు.‘అల్లరి’ నరేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మే 9న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. కెమెరా: కె.యు.మోహనన్.