Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య, చిరంజీవి చిత్రాలపై నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్.. కుల చిచ్చు రగిల్చే ప్రయత్నం జరుగుతోంది..

2023 సంక్రాంతి ఫైట్ టాలీవుడ్ లో ఎంతటి ఉత్కంఠ రేకేత్తిస్తోందో అందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు బిగ్గెస్ట్ క్లాష్ కి సిద్ధం అవుతున్నాయి.

Nara Lokesh interesting comments on Veerasimhareddy and waltair Veerayya
Author
First Published Jan 11, 2023, 10:12 PM IST

2023 సంక్రాంతి ఫైట్ టాలీవుడ్ లో ఎంతటి ఉత్కంఠ రేకేత్తిస్తోందో అందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు బిగ్గెస్ట్ క్లాష్ కి సిద్ధం అవుతున్నాయి. ఈ రెండు చిత్రాలని నిర్మించింది మైత్రి మూవీస్ సంస్థే కావడం విశేషం. మరికొన్ని గంటల్లో వీరసింహారెడ్డి చిత్రం సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయబోతోంది. 

చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ జనవరి 13న రానుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ఈ రెండు చిత్రాలని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంచలన కామెంట్స్ తో ట్వీట్స్ చేశారు. 

'బాల మావయ్య, చిరంజీవి గారు నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలకు నా శుభాకాంక్షలు. ఈ రెండు చిత్రాల మాస్ ఎంటర్టైన్మెంట్ ని ఆస్వాదించేందుకు లక్షలాది అభిమానులతో నేను కూడా జాయిన్ అవుతాను. 

అయితే ఈ రెండు చిత్రాలని అడ్డు పెట్టుకుని ఫ్యాన్ వార్స్ సృష్టించేందుకు, కులాల మధ్య చిచ్చు రగిల్చేందుకు అధికార పార్టీ నుంచి కొన్ని దుష్టశక్తులు సిద్ధంగా ఉన్నాయి. ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ తో ఒక కమ్యూనిటీని మరో కమ్యూనిటీ రెచ్చగొట్టేలా పోస్ట్ లు పెడతారు. అలాంటి అకౌంట్స్ పై రిపోర్ట్ చేయండి. వాళ్ళ ట్రాప్ లో పడొద్దు. సినిమా అంటే వినోదం.. దీనికి ఎలాంటి హద్దులు లేవు. మనమంతా ఒక్కటే.. కులం, మతం, ప్రాంతం మనల్ని విడదీయలేదు అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios