లడఖ్ లో నారా బ్రాహ్మిణీ బైక్ విన్యాసాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
నారావారి కోడలు.. నందమూరి బాలకృష్ణ పెద్ద కూతురు నారాబ్రహ్మణీ తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతోంది. ఇటు కుటుంబ, అటు బిజినెస్ తో పాటు.. సాహయాత్రలు చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
బైక్ రైడింగ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. మన సెలబ్రిటీలలో చాలామంది బైక్ రైడర్స్ ఉన్నారు. హీరో అజిత్ లాంటి వారు.. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళి సోషల్ మీడియాలో సందడి చేశారు. ముఖ్యంగా హిమాలయాల్లో బైక్ రైడ్ చేయడం అంటే చాలా మంది యూత్ పోటీపడుతుంటారు. అందులో లేడీస్ కూడా చాలా మంది ఈ విషయంలో ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అటువంటి వారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. మహిళ సెలబ్రిటీలు బైక్ రైడ్స్ చేయడం చాలా అరుదు.. అలాంటి అరుదైన వారిలో.. నారా బ్రహ్మణి కూడా ఒకరు.
అవును అందరికి ఆశ్చర్య కలిగించే విషయమే అయినా.. ఇది నిజం..? నందమూరి బాలకృష్ణ కుమార్తె, చంద్రబాబునాయుడు కోడలు, నారా లోకేష్ భార్య నారా బ్రహ్మణి కూడా మంచి బైక్ రైడర్. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ విషయంలో ఆమె పెద్దగా పబ్లిసిటీకోరుకోరు. ఎక్కడికి వెళ్ళినా.. కామ్ గా తన పని తాను చేసుకుని వస్తుంటారు బ్రహ్మిణి. ఈ సారి హిమాలయాల్లో బైక్ రైడ్ కు వెళ్లింది బ్రహ్మిణి. అయితే ఈ విషయం ఆమె మాత్రం వెల్లడించలేదు. కానీ ఓ బైక్ కంపెనీ ఆమె టీం తమ బైక్ రైడింగ్ విషయాలతో కూడిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అసలు విషయం బయటకు వచ్చింది.
ఎంత ఎత్తును అయినా.. అవలీలగా ఎక్కగల పవర్ ఉన్న బైక్లను తయారు చేసే ఓ కంపెనీ ప్యాషనేట్ రేసర్లను ఓ టీంలను ఏర్పాటు చేసి.. తమ బైక్ల మీద ఇలా ట్రిప్లకు ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఈ సారి జరిగిన ట్రిప్ లో నారా బ్రహ్మణి పాల్గొన్నారు. ఇలాంటి ట్రిప్లలో టీమ్గా వెళ్తారు కానీ... ఎవరికీ లగేజీ వాళ్లే తీసుకెళ్లాలి. ఎవరూ సహాయంగా ఉండరు. బైక్కు ఏమైనా సమస్య వచ్చినా.. ప్రమాదం జరిగినా సాయం చేయడానికి కంపెనీ టీం ఉంటుంది.
ఇలాంటి సాహసానికి ఏమాత్రం తగ్గకుండా రెడీ అయ్యింది బ్రహ్మీణీ. ఈ రేస్ ను అవలీలగా పూర్తి చేసింది. అంతే కాదు ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని కూడా వెల్లడించారు. ఈ సాహయయాత్ర జమ్మూ కశ్మీర్లోని లద్దాఖ్ నుంచి లెహ్ వరకూ సాగింది. బైక్ను చాలా అలవోకగా నడిపిన నారా బ్రహ్మణి.. అప్పుడప్పుడు విన్యాసాలతో ఆకట్టుకుంది. ఈ విషయం తెలిసిన జనాలు షాక్ ఆవుతున్నారు.