Asianet News TeluguAsianet News Telugu

నందమూరి బ్రదర్స్ ప్లానింగ్ సూపర్

  • దసరా కానుకగా జై లవ కుశ
  • ప్రమోషన్ పనుల్లో  బిజీ బిజీ గా కళ్యాణ్ రామ్
  • బిగ్ బాస్ హౌస్ కి కళ్యాణ్ రామ్
nandamuri brothers surprising plans for jai lava kusa

ఈ దసరా పండుగ.. నందమూరి బ్రదర్స్.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్.. ఇద్దరికీ చాలా కీలకం. ఎన్టీఆర్ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘జై లవ కుశ’ ఈ పండగకే విడుదలౌతోంది. తన సొంత బ్యానర్ లో తమ్ముడి చిత్రాన్ని నిర్మించాడు కల్యాణ్ రామ్. అందుకే వీరిద్దరికీ ఈ సినిమా చాలా కీలకం, చాలా చాలా స్పెషల్ కూడా. అందుకే సినిమా మొదలు పెట్టిన దగ్గరి నుంచి , మూవీ ప్రమోషన్స్ వరకు ఇద్దరూ కలిసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

ఈ సినిమాతో పాటు వారం రోజుల తేడాతో మహేష్ స్పైడర్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.  ఈ రెండు సినిమాల మధ్య టఫ్ కాంపిటేషన్ ఉండే అవకాశం చాలా ఎక్కువ. అందుకే.. ఆ లోపే.. అత్యంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నారట ఈ నందమూరి బ్రదర్స్.

 

సినిమాలోని కొన్ని మంచి మంచి సీన్లను ప్రోమోలుగా కట్ చేయించాడట కళ్యాణ్ రామ్. వాటిని సినిమా విడుదల తర్వాత టీవీల్లో ప్రసారం చేయించాలనుకుంటున్నారట. సినిమా ప్రచారం కోసం.. ప్రింట్, టీవీ, డిజిటల్ మీడియాలన్నింటీనీ వాడేస్తున్నారట. మూవీ టాక్ ఎలా ఉన్నా.. రెండు వారాల్లో పెట్టుబడులు వచ్చేయాలని.. సినిమా కచ్చితంగా రూ.100కోట్ల క్లబ్ లో చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. మూవీ ప్రమోషన్స్ లో భాగంగానే  శనివారం కళ్యాణ్ రామ్, రాశీఖన్నా, నివేదా థామస్ లు బిగ్ బాస్ హౌజ్ లో సందడి చేయనున్నారు.

 

ఇప్పటికే ట్రైలర్ ని చూసిన సినీ వర్గాలు, అభిమానులు సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు సినిమాలో ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడనేది సెన్సార్ టాక్. ఇవన్నీ కూడా సినిమా కి బాగా కలిసొస్తున్నాయి. ఈ సినిమా ప్రమోషన్ ఖర్చుతో ఓ చిన్న సినిమా తీయొచ్చనేది టాలీవుడ్ టాక్.

 

Follow Us:
Download App:
  • android
  • ios