నాగ్ డెసిషన్ షాకే,కానీ వర్కవుట్ అయితే కేకే
ఎలాంటి సినిమా చేయాలి..ఏ సినిమాని జనం ఆదరిస్తారు అనే విషయమై డైలమోలో పడ్డారు. ది ఘోస్ట్ సీరియస్ మూవీ కావటంతో ఈసారి ఎంటర్టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
నాగార్జున కెరీర్ ఈ మధ్యన బాగా స్లో అయ్యింది. యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘ది ఘోస్ట్’ మూవీతో దసరాకి ప్రేక్షకుల ముందకు వచ్చారు. ఈ సినిమా మంచి ఎక్సపెక్టేషన్స్ తో రిలీజైనప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడింది. దాంతో ఆయన ఎలాంటి సినిమా చేయాలి..ఏ సినిమాని జనం ఆదరిస్తారు అనే విషయమై డైలమోలో పడ్డారు. ది ఘోస్ట్ సీరియస్ మూవీ కావటంతో ఈసారి ఎంటర్టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో ఆయన తన నెక్ట్స్ మూవీని డైరెక్టర్ మోహనరాజాతో చేయనున్నారని గత కొంతకాలంగా ప్రచారం జరిగింది.
‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్ టైమ్ లో మోహనరాజా కూడా నాగార్జునతో మూవీ చేయనున్నానని చెప్పడంతో త్వరలోనే ఈ సినిమాని ప్రకటిస్తారని అనుకున్నారు. అయితే.. ఇప్పట్లో ఈ సినిమా ఉండదని తెలిసింది. మోహనరాజా హిందీ మూవీ చేయాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన వర్క్ లో బిజీగా ఉన్నారని తెలిసింది.
ఇప్పుడు నాగార్జున నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తున్నారంటే.. ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ రైటర్ బెజవాడ ప్రసన్నతో అని టాక్ వినిపిస్తోంది. నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన సినిమాలకు కథ, మాటలు అందించే బెజవాడ ప్రసన్న నాగార్జున కోసం ఓ స్టోరీ రెడీ చేశారట. మలయాళంలో సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్ (Porinju Mariam Jose) అనే చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నారట.
మళయాళ చిత్రం రీమేక్ గా రూపొందే ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథ నాగార్జునకు నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మొదట ఈ మూవీని డైరెక్ట్ చేయడం కోసం ఒకరిద్దరు దర్శకులను అనుకున్నప్పటికీ సెట్ కాలేదట. దీంతో బెజవాడ ప్రసన్న రాసిన వెర్షన్ ను వేరే డైరెక్టర్ తో తెరకెక్కించడం కన్నా.. ప్రసన్నకే దర్శకత్వ బాధ్యతలు అప్పగిస్తే.. బాగుంటుందని ఫిక్స్ అయ్యారట నాగార్జున.
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. ఈ మూవీని ఏ బ్యానర్ లో నిర్మిస్తారనేది తెలియాల్సివుంది. త్వరలోనే ఈ సినిమాని అఫిషియల్ గా అనౌన్స్ చేయనున్నారని సమాచారం. మరి.. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కింగ్ నాగార్జున ఈ సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి.