Asianet News TeluguAsianet News Telugu

Nagarjuna: నాగార్జున 'ఘోస్ట్' మూవీ షూటింగ్ కంప్లీట్.. రెడీ అవుతున్న కిల్లింగ్ మెషీన్

ప్రవీణ్ సత్తారు ప్రతిభ ఉన్న దర్శకుడు అని చెప్పడంలో సందేహం లేదు. గరుడ వేగ లాంటి సీరియస్ యాక్షన్ డ్రామాని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు కింగ్ నాగార్జునతో ఘోస్ట్ చిత్రం తెరకెక్కిస్తున్నారు.

Nagarjuna ghost movie shooting update
Author
Hyderabad, First Published Aug 8, 2022, 5:26 PM IST

ప్రవీణ్ సత్తారు ప్రతిభ ఉన్న దర్శకుడు అని చెప్పడంలో సందేహం లేదు. గరుడ వేగ లాంటి సీరియస్ యాక్షన్ డ్రామాని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు కింగ్ నాగార్జునతో ఘోస్ట్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఇది. 

నాగార్జున యాక్టన్ మూవీతో హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. ఘోస్ట్ చిత్రంలో నాగార్జునని ప్రవీణ్ సత్తారు పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేస్తున్నారు. నాగార్జున ఫ్యాన్స్ ఈ మూవీపై కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తాజాగా ఘోస్ట్ చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. 

ఘోస్ట్ మూవీ షూటింగ్ ఫినిష్ అయినట్లు ప్రకటించారు. ఘోస్ట్ మూవీ షూటింగ్ పూర్తయింది. కిల్లింగ్ మెషీన్ ని అక్టోబర్ 5న రివీల్ చేయబోతున్నాం అని ప్రకటించారు. ఈ చిత్రంలో నాగార్జునని కిల్లింగ్ అంటూ ప్రస్తావిస్తున్నారు. టీజర్ లో కూడా అదే విషయాన్ని తెలిపారు. కత్తితో నరుకుతూ నాగ్ నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. అసలు నాగ్ పాత్ర ఏంటి.. ఎందుకు అలా మనుషుల్ని చంపుతున్నాడు అనేది తెలియాలంటే అక్టోబర్ 5 వరకు ఆగాల్సిందే. 

భరత్ సౌరభ్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నాగార్జునకి జోడిగా ఈ మూవీలో సోనాల్ చౌహన్ నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios