నాగార్జున 'ఘోస్ట్' సెన్సార్ కంప్లీట్.. ఇక అఫీషియల్ గా 'గాడ్ ఫాదర్'తో ఢీ..
నాగార్జున యాక్షన్ మూవీతో హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. అక్కినేని ఫ్యాన్స్ కి ఘోస్ట్ ఆ కోరిక తీరుస్తుందని భావిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ చిత్రం రిలీజ్ అవుతున్నట్లు ఇది వరకే ప్రకటించారు.
ప్రవీణ్ సత్తారు ప్రతిభ ఉన్న దర్శకుడు అని చెప్పడంలో సందేహం లేదు. గరుడ వేగ లాంటి సీరియస్ యాక్షన్ డ్రామాని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు కింగ్ నాగార్జునతో ఘోస్ట్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఇది.
నాగార్జున యాక్షన్ మూవీతో హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. అక్కినేని ఫ్యాన్స్ కి ఘోస్ట్ ఆ కోరిక తీరుస్తుందని భావిస్తున్నారు. అక్టోబర్ 5న ఈ చిత్రం రిలీజ్ అవుతున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ఇక ఘోస్ట్ రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది. నేడు సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని కింగ్ నాగార్జున స్వయంగా ట్వీట్ చేశారు. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి 'యు/ఏ' సర్టిఫికేట్ అందించారు.
దీనితో మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ చిత్రంతో 'ఘోస్ట్' ఢీ అఫీషియల్ గా ఖరారైంది. విజయదశమి రోజున ఈ రెండు చిత్రాలు ప్రేక్షకులని పలకరించబోతున్నాయి. ఘోస్ట్ చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ కూడా వచ్చింది.
ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక సెప్టెంబర్ 25న కర్నూలు లోని ఎస్టీబీసీ కాలేజ్ గ్రౌండ్స్ లో జరగనుంది. ఘోస్ట్ చిత్రంపై ప్రస్తుతం పాజిటివ్ బజ్ ఉందనే చెప్పాలి. నాగ్ కి జోడిగా హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ నటిస్తోంది. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.