ఇదేం పద్దతి?... 'బిగ్ బాస్'పై మండిపడ్డ నాగార్జున!?
ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్స్ ఎంపిక చేసిన మేకర్స్, వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ అని నిర్థారణ అయ్యాక ఓ స్టార్ హోటల్లో ఉంచినట్లు తెలుస్తుంది. కింగ్ నాగార్జున పుట్టిన రోజైన ఆగస్టు 29 లేదా 30న షో ప్రారంభం కాబోతుందని ప్రచారం కూడా జరిగింది. కానీ కంటిస్టెంట్స్ లో కొందరికి కరోనా రావటంతో సెప్టెంబర్ 5 వాయిదా పడింది. అయితే పనులు మాత్రం ఆగలేదు.
మరి కొన్ని రోజుల్లో బిగ్బాస్ సీజన్ 4 సందడి మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ఈమేరకు ఏర్పాట్లన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పటికే 16 మంది కంటెస్టెంట్స్ ఎంపిక చేసిన మేకర్స్, వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి నెగెటివ్ అని నిర్థారణ అయ్యాక ఓ స్టార్ హోటల్లో ఉంచినట్లు తెలుస్తుంది. కింగ్ నాగార్జున పుట్టిన రోజైన ఆగస్టు 29 లేదా 30న షో ప్రారంభం కాబోతుందని ప్రచారం కూడా జరిగింది. కానీ కంటిస్టెంట్స్ లో కొందరికి కరోనా రావటంతో సెప్టెంబర్ 5 వాయిదా పడింది. అయితే పనులు మాత్రం ఆగలేదు. ఈ పనులను గమనిస్తున్న నాగ్ ..ఈ షో నిర్వాహకులపై మండిపడినట్లు మీడియా వర్గాల ద్వారా తెలిసింది.
అందుకు కారణం బిగ్ బాస్ షోకు సంబంధించిన పనులు నత్తనడకన సాగుతూ ఉండటమే అంటున్నారు. ఈ విషయం గమనించిన నాగార్జున నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈపాటికే ప్రోమోల షూటింగ్, కంటెస్టెంట్లు హౌస్ లోకి వెళ్లే షూటింగ్ ముగిసి, నెలాఖరు నుంచి హౌస్ లో షో ప్రారంభం కావాల్సి వుండగా, అది కాస్తా సెప్టెంబర్ 5కు వాయిదా పడింది.
ఈ విషయంలోనే నాగ్ కాస్తంత అసంతృప్తిగా ఉన్న వేళ, ప్రోమోల షూటింగ్ ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. నిన్న జెమినీ చానల్ యాంకర్ అరియానా గ్లోరీ హౌస్ లోకి వెళ్లే సీన్, యూ ట్యూబర్ మహబూబ్ దిల్ సేపైనా ఇదే సీన్ ను తీయాలని షెడ్యూల్ చేసుకోగా, అరియానా గ్లోరీ కోసమే రోజంతా శ్రమించాల్సి వచ్చింది. దీంతో మెహబూబ్ ప్రోమో షూటింగ్ నేటికి వాయిదా పడింది. ఒక్కరికోసమే రోజంతా సమయం కేటాయించాల్సి రావడం ఏంటని నాగ్ కోపడ్డారని చెప్తున్నారు.
అయితే అందుకు కారణం.. బిగ్ బాస్ హౌస్ సిబ్బంది సంఖ్యను తగ్గించి, హౌస్ లో అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ కార్యక్రమాన్ని కొనసాగించమే అని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పారట.
ఇక బిగ్బాస్ సీజన్4 ను గతం కంటే డిఫరెంట్గా, మరింత ఆకర్షణీయంగా ఉండేలా ప్లాన్ చేశారట మేకర్లు. బుల్లితెరపై పేరుమోసిన యాంకర్లు, ఇతర నటీనటులతో పాటుగా టిక్టాక్ స్టార్లను కూడా ఈ సారి షోకు ఎంపిక చేశారట. ఈ సీజన్లో జబర్దస్త్ కెవ్వు కార్తీక్, సింగర్ నోయల్ సేన్, యాంకర్లు లాస్య, అరియానా, నటులు కరాటే కళ్యాణి, సురేఖా వాణి, పూనమ్ బజ్వా, పూజిత పొన్నాడ, యూట్యూబర్లు అలేఖ్య హారిక, మహబూబ్ దిల్ సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్లు కంటెస్టెంట్లుగా ఉండబోతున్నట్లు సమాచారం.