కామాక్షి మూవీస్ అధినేత, టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి(62)ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ రెడ్డి చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు
కామాక్షి మూవీస్ అధినేత, టాలీవుడ్ ప్రొడ్యూసర్ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి(62)ఈరోజు ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్ రెడ్డి చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు.
ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. హీరో నాగార్జునతో శివప్రసాద్ కి ప్రత్యేకమైన బంధం ఉంది. నాగార్జున నటించిన ఎన్నో చిత్రాలకి శివప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.
శివప్రసాద్ సినీ ప్రస్థానం దాదాపు నాగార్జునతోనే కొనసాగింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. శివప్రసాద్ మరణంతో ఎమోషనల్ అయిన నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
''నేను నా స్నేహితుడు, నిర్మాత అయిన శివప్రసాద్ రెడ్డిని కోల్పోయాను. 33 సంవత్సరాలుగా నా సినీ కెరీర్, జీవితంలో ఆయన భాగమైపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా'' అని వెల్లడించారు.
సంబంధిత వార్త..
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 27, 2018, 1:49 PM IST