వద్దని చెబుతున్నా తేజు వినడం లేదా..హెల్త్ అప్డేట్ ఇచ్చిన నాగబాబు
ఓ ఇంటర్వ్యూలో నాగబాబు.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 10న తేజు బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గాయాలపాలైన తేజు కొన్ని వారాలుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మా ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. దీనితో నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానల్ కి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ప్రకాష్ రాజ్ కే ఓటేయాలని మా సభ్యులని కోరుతున్నారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య తీవ్రమైన పోటీ నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణుకి ఇండస్ట్రీలోని ఓ వర్గం మద్దతు తెలుపుతుండగా.. ప్రకాష్ రాజ్ కు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉందని నాగబాబు అంటున్నారు. మరి విజయం ఎవరిదో రేపు తేలిపోనుంది.
ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో Naga Babu.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 10న తేజు బైక్ పై వెళుతూ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. గాయాలపాలైన తేజు కొన్ని వారాలుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సాయిధరమ్ తేజ్ స్పీడ్ గా కోలుకుంటున్నట్లు మెగా బ్రదర్ నాగబాబు వివరించారు.
మరో 30, 40 రోజుల్లో తేజు పూర్తిగా కోలుకుంటాడని నమ్మకంగా చెప్పొచ్చు. అయితే రెండు నెలలపాటు రెస్ట్ తీసుకోమని మేమంతా సూచిస్తున్నాము. కానీ తేజు మాత్రం త్వరగా షూటింగ్స్ కి హాజరు కావాలని అంటున్నాడు. ప్రస్తుతం ఫిజియో థెరపీ జరుగుతోంది. వేగంగా కోలుకుంటున్నాడు అని నాగబాబు అన్నారు. ఇటీవల Sai Dharam Tej ఆసుపత్రి నుంచి థమ్స్ అప్ చూపిస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: నేనే అధ్యక్షుడిగా పోటీ చేద్దామనుకున్నా.. డ్రాప్ అయింది అందుకే , మా ఎన్నికలపై రాజశేఖర్
తేజు చికిత్స పొందుతుండగానే రిపబ్లిక్ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తేజు కలెక్టర్ పాత్రలో నటించాడు. తేజు తదుపరి ఓ థ్రిల్లర్ మూవీకి సైన్ చేశాడు. ఈ చిత్ర షూటింగ్ నవంబర్ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి తేజు అప్పటికల్లా పూర్తి ఫిట్ నెస్ సాధిస్తాడా లేదా వేచి చూడాలి. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం తేజు వైద్యం, ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేస్తున్నారు.