ఫైనల్ గా నాగబాబే తలవొంచారు...అల్లు అర్మీ దెబ్బకి

 అల్లు అర్జున్ అభిమానులు సైతం నాగబాబుని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. అయితే ఈ వివాదం ముదరడంతో నాగబాబు

Naga Babu Deactivates Twitter Account jsp


ట్విట్టర్ లో నాగబాబు, అల్లు అర్మీ యుద్దం క్లైమాక్స్ కు చేరింది. చివరకు నాగబాబు తగ్గి ట్విట్టర్ నుంచి డీ యాక్టివేట్ చేసుకుని వెళ్లిపోయారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం అల్లు అర్జున్ అభిమానులే అనేది అందరకి తెలిసిన విషయం. 

సరిగ్గా పోలింగ్‌కు రెండు రోజుల ముందు అంటే ఈనెల 11న వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లారు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత అంటే 13న నాగబాబు చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడైన పరాయివాడే.. మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే అంటూ నాగబాబు ఓ ట్వీట్ చేశారు. 

 ఈ ట్వీట్‌ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని మీడియాలో, సోషల్‌మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. శిల్పా రవిచంద్రారెడ్డి తనకు దగ్గరి మిత్రుడు కావడం వల్లే వెళ్లానని.. తన స్నేహితులు ఎక్కడ ఉన్నా వారి మేలు కోరుకుంటానంటూ అల్లు అర్జున్ తన పర్యటనపై క్లారిటీ ఇచ్చారు. కానీ నాగబాబు మాత్రం తన ట్వీట్‌పై క్లారిటీ ఇవ్వలేదు.
 
ఈ క్రమంలో అల్లు అర్జున్ అభిమానులు సైతం నాగబాబుని టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. అయితే ఈ వివాదం ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేశారు. నిజానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఆయన కోసం మెగా హీరోలు చాలామంది వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. అల్లు అర్జున్ కేవలం పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియా పోస్ట్ కి మాత్రమే పరిమితమయ్యారు. 

అయితే తన స్నేహితుడిగా చెప్పుకుంటున్న నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం మాత్రం స్వయంగా వెళ్లి తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా కోరారు. ఈ అంశం మీద అటు మెగా అభిమానులకు ఇటు అల్లు అభిమానులకు మధ్య కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్ల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు నాగబాబు సోషల్ మీడియా అకౌంట్ డి ఆక్టివేట్ చేయడం చర్చనీయాంశమైంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios