Asianet News TeluguAsianet News Telugu

మైత్రిని దెబ్బకొట్టిన రవితేజ - చైతు చిత్రాలు!

శ్రీమంతుడు సినిమాతో సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ హైట్రిక్ విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. జనతా గ్యారేజ్ - రంగస్థలం సినిమాలతో మంచి లాభాలను అందుకొని హ్యాట్రిక్ విజయాలని సొంతం చేసుకుంది. 

mythri movie mekars huge loss
Author
Hyderabad, First Published Nov 21, 2018, 5:45 PM IST

శ్రీమంతుడు సినిమాతో సినిమా ప్రొడక్షన్ లోకి అడుగుపెట్టిన మైత్రి మూవీ మేకర్స్ హైట్రిక్ విజయాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. జనతా గ్యారేజ్ - రంగస్థలం సినిమాలతో మంచి లాభాలను అందుకొని హ్యాట్రిక్ విజయాలని సొంతం చేసుకుంది. 

అయితే హ్యాట్రిక్ విజయాల తరువాత సంస్థకు వరుస డిజాస్టర్స్ దెబ్బకొట్టాయి. అప్పటివరకు పెద్ద దర్శకులతో స్టార్ హీరోలతో పనిచేసిన మైత్రి పెద్దగా మార్కెట్ లేని హీరోలతో ప్రయోగం చేసింది. సవ్యసాచి - అమర్ అక్బర్ ఆంటోని సినిమాలకు లెక్కలకు మించిన బడ్జెట్ ల వల్ల భారీ నష్టాలను చూడాల్సివచ్చింది. 

నాగచైతన్య చేసిన సవ్యసాచి పెద్దగా లాభాలను ఇవ్వలేదు. అయితే బయ్యర్స్  ఎక్కువగా నష్టపోయారు. ఇక శ్రీను వైట్ల మీద నమ్మకంతో అమర్ అక్బర్ ఆంటోనికి కూడా గట్టిగానే ఖర్చు చేశారు. సినిమాలో కంటెంట్ ఆడియెన్స్ కి కనెక్ట్ అవ్వకపోవడంతో రెండవరోజే కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. ఈ సినిమా మైత్రి బ్యానర్ కి ఎక్కువ లాస్ ని కలుగజేసింది. 

దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ పై మైత్రి యజమానులు నవీన్-రవిశంకర్ - మోహన్ లు ప్రత్యేక ద్రుష్టి ఉంచారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ - డియర్ కామ్రేడ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ - చిత్రలహరి సినిమాలను వీరు నిర్మిస్తున్నారు. సంతోష్ శ్రీనివాస్ - రవితేజతో కూడా ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నప్పటికీ ఇంకా ఫైనల్ నిర్ణయాన్ని తీసుకోలేదని సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios