సారాంశం

బాలీవుడ్ ఎంట్రీకి రెడీ మైత్రీ మూవీ మేకర్స్ రెడీ అవుతున్నారు. అది కూడా సల్మాన్ ఖాన్ తో  సినిమాకు రెడీ అవుతున్నారు. 

టాలీవుడ్(Tollywood) లో టాప్ ప్రొడ్యూసర్స్ గా వెలుగు వెలుగుతున్నారు మైత్రీ మూవీ మేకర్స్.  అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటిగా మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు. మహేష్ బాబుతో శ్రీమంతుడు సినిమాతో ప్రయాణం మొదలు పెట్టిన మైత్రీ వారు.. అల్లు అర్జున్ పుష్ప వరకు అన్ని భారీ సినిమాలు నిర్మించి వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. టాలీవుడ్ లో హిట్ సినిమాల ఎక్కువగా చేసిన నిర్మాణ సంస్థల్లో.. ముందున్నారు మైత్రీ వారు. ఎంతో మంది దర్శకులకు లైఫ్ ఇచ్చిన ఈ నిర్మాణ సంస్థ త్వరలో బాలీవుడ్  ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. 

 ఇప్పుడు మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఏకంగా సల్మాన్ ఖాన్ తో కలిసి. సల్మాన్ ఖాన్(Salman Khan) ఫిలిమ్స్, మైత్రి మూవీ మేకర్స్, మరో నిర్మాణ సంస్థ కలిసి బాలీవుడ్ లో ‘ఫర్రి’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది ఈ సినిమా. థాయిలాండ్ కి చెందిన బ్యాడ్ జీనియస్ అనే సినిమాకు  రీమేక్ గా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. 

ఇక రీసెంట్ గా  ఫర్రి ట్రైలర్ కూడా రిలిజ్ చేశారు టీమ్.. కొంతమంది స్మార్ట్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ లో ఎలా కాపీ కొడతారు, అలాంటి వాళ్ళని ఎలా పట్టుకున్నారు, వాళ్ళ లైఫ్ ఏమైంది అనేది ఈసినిమా కథ. ఇంట్రెస్టింగ్ స్టోరీతో యూత్ ను అట్రాక్ట్ చేసేలా ఈమూవీ తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాను ఫర్రీ సినిమా నవంబర్ 24న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్.  అయితే ఈ సినిమాకి సల్మాన్ ఖాన్ కేవలం నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. అంతే కాదు ఈమూవీలో సల్మాన్ గెస్ట్ రోల్ చేసినట్టు సమాచారం. 

 సల్మాన్ తో కలిసి ఓ సినిమాని బాలీవుడ్ లో మైత్రి మేకర్స్ నిర్మిస్తుండటంతో.. మైత్రీ వారు బాలీవుడ్ లో కూడా తమ విజయపరంపర కొనసాగించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పటికే గీతాఆర్ట్స్ బ్యానర్ బాలీవుడ్ లో సినిమాలు నిర్మిస్తోంది. ఇలా బాలీవుడ్ లో టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ హవా కూడా పెరుగుతుంది. ఇక సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం  ప్రభాస్ – సిద్ధార్థ్ ఆనంద్ సినిమాని కూడా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని సమాచారం.