Asianet News TeluguAsianet News Telugu

‘వీరసింహారెడ్డి’ ఫస్ట్ సింగిల్ పై థమన్ క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ తొడగొట్టి దుమ్ములేపే టైం వచ్చేసింది!

నందమూరి బాలకృష్ణ-  గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఇప్పటికే తుదిదశ షూటింగ్ జరుగుతుండగా.. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందనున్నాయి. తాజాగా థమన్ క్రేజీ అప్డేట్ అందించారు. 
 

Music Director Thaman gave an update on fist single of Balakrishnas Veera Simha Reddy!
Author
First Published Nov 19, 2022, 2:14 PM IST

నందమూరి నటసింహం, సీనియర్ హీరో బాలకృష్ణ (Balakrishna) బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో దుమ్ములేపుతున్న విషయం తెలిసిందే. పౌరాణికం, యాక్షన్ ఫిల్మ్స్ తో అదరగొడుతోంది. రీసెంట్ గా ‘అఖండ’తో భారీ సక్సెస్ అందుకున్న బాలయ్య ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మాలినేని (Gopichand) దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవలనే కర్నూలు బురుజు కొండపై ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ నూ ఖరారు చేశారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రం ప్రస్తుతం తుదిదశ షూటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది.

త్వరలోనే షూటింగ్ పార్ట్ పూర్తి కానుండటంతో మేకర్స్ Veera Simha Reddy నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్ అందించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ పై సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (Thaman S) అదిరిపోయే అప్డేట్ అందించారు. ఫస్ట్ సింగిల్ గా ‘జై బాలయ్య’ అనే సాంగ్ రానున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో థమన్ అప్డేట్ ఇస్తూ.. ‘త్వరలోనే తొడగొట్టి దుమ్ములేపే టైమ్ వచ్చింది రోయ్’ అంటూ అభిమానులను అలర్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ మాత్రం ఫైరింగ్ గా ఉంటుందని అంచనాలు పెంచేశారు.

‘అఖండ’కు గూస్ బంప్స్ తెప్పించే ట్రాక్స్ ను  అందించిన థమన్ ‘వీరసింహారెడ్డి’కి కూడా అంతకు మించి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ సింగిల్ పై ఆసక్తినెలకొంది. ఇప్పటికే వచ్చిన టీజర్, గ్లింప్స్ లో మ్యూజిక్ అదిరిపోయిన విషయం తెలిసిందే. ‘వీరసింహారెడ్డి’లోనూ ‘జై బాలయ్య’ టైటిల్ తో సాంగ్ ఉంటుందని అంటున్నారు. ఫస్ట్ సింగిల్ గా ఆపాటనే వదులుతారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తొలిపాట రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేయనున్నారు. 
 
రీసెంట్ గా అనంతపురం జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో  ‘వీరసింహారెడ్డి’ చిత్ర షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే.  మరికొన్ని షెడ్యూళ్లను పూర్తి చేసి త్వరలోనే షూటింగ్ ను ముగించనున్నారు. బాలయ్య సరసన హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) ఆడిపాడుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios