తూఫాన్ బాధితులకు 'మా' సాయం!
శ్రీకాకుళం వాసులను తిత్లీ తూఫాన్ తీవ్ర నష్టానికి గురి చేసిన సంగతి తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు వారికి తోచినంత విరాళాలను అందిస్తున్నారు
శ్రీకాకుళం వాసులను తిత్లీ తూఫాన్ తీవ్ర నష్టానికి గురి చేసిన సంగతి తెలిసిందే. వరద బాధితులను ఆదుకునేందుకు ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు వారికి తోచినంత విరాళాలను అందిస్తున్నారు. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కి నేడు ఉదయం అల్లు అర్జున్ 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. మరికొంత యువ హీరోలు సీనియర్ హీరోలు అంతకుముందే విరాళాలను అందించారు.
ఇక తెలుగు చిత్రపరిశ్రమ నుంచి వరద బాధితుల సహాయార్ధం శనివారం ఉదయం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఐదు లక్షల రూపాయల చెక్ ను ముఖ్యమంత్రి సహాయనిధి కి మంత్రి గంటా శ్రీనివాసరావు కు అందచేశారు. ఈ కార్యక్రమం లో 'మా' అధ్యక్షులు శివాజీరాజా ,జెనరల్ సెక్రటరీ డా. వి.కె. నరేష్ , వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ పాల్గొన్నారు.
అలాగే ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వర రావు, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్ ,నటుడు నిర్మాత అశోక్ కుమార్, నాగినీడు ,సురేష్ కొండేటితో పాటు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.