సారాంశం
పుష్ప2 బడ్జెట్ లో అరవై శాతం హీరో డైరెక్టర్ రెమ్యూనరేషన్ రూపంలోనే పోతుందట. అల్లు అర్జున్, సుకుమార్ భారీగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తుండగా.. ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.
అల్లు అర్జున్-సుకుమార్(Sukuma) కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప భారీ విజయం సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో నష్టాలు మిగిల్చిన ఈ చిత్రం హిందీతో పాటు ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి పుష్ప రూ. 360 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకుంది. ఈ నేపథ్యంలో పుష్ప సీక్వెల్... మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 బడ్జెట్ రూ. 350 కోట్లకు పెంచేశారు. అలాగే ముందుగా అనుకున్న స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం. అయితే పుష్ప 2 చిత్రానికి కేటాయించిన బడ్జెట్ లో అరవై శాతానికి పైగా హీరో, దర్శకుడు రెమ్యూనరేషన్స్ రూపంలోనే పోతుందట.
పుష్ప 2 కోసం అల్లు అర్జున్(Allu Arjun) ఏకంగా రూ. 120 కోట్లు తీసుకుంటున్నారట. మరో రూ. 80 కోట్లు సుకుమార్ రెమ్యునరేషన్ గా తెలుస్తుంది. వీరిద్దరూ కలిపి రూ. 200 కోట్లు తీసుంటున్నారట. నిన్న మొన్నటి వరకు రూ. 30 కోట్లు లోపే తీసుకున్న అల్లు అర్జున్ ఏకంగా రూ. 120 కోట్లు డిమాండ్ చేయడం నిజంగా అనూహ్య పరిణామం. ఇక సుకుమార్ సైతం రూ. 12 నుండి 15 కోట్లు తీసుకునేవారు. సుకుమార్, అల్లు అర్జున్ తమ గత రెమ్యూనరేషన్స్ కి మూడు నాలుగు రెట్లు అధికంగా పుష్ప 2 కోసం ఛార్జ్ చేస్తున్నారు.
మరోవైపు ఆగస్టు నుండి పుష్ప 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. అయితే టాలీవుడ్ లో అన్ని చిత్రాల షూటింగ్స్ నిలిపివేయాలంటూ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. కొన్ని సమస్యలకు పరిష్కారం దొరికే వరకు షూటింగ్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం లేదు. ఈ నెలలో మొదలు కావాల్సిన పుష్ప 2, మహేష్-త్రివిక్రమ్ మూవీ షూటింగ్స్ హోల్డ్ లో పడ్డాయి.
ఇక పుష్ప 2(Pushpa 2) చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి కీలక పాత్రలు చేస్తున్నారు. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 10 భాషల్లో విడుదల కానున్నట్లు సమాచారం. 2023 లో పుష్ప థియేటర్లో దిగనుంది.