సోషల్‌ మీడియాలో మోహన్‌బాబు వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, మోహన్‌బాబుని టార్గెట్‌ చేస్తూ నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారని తాజాగా యూట్యూబ్‌ ఛాన్సెల్స్ కి, సోషల్‌ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నిర్వహకులకు తెలిపారు మోహన్‌బాబు టీమ్‌. 

మోహన్‌బాబు(Mohanbabu) ట్రోలర్స్ కి షాక్‌ ఇచ్చారు. తనపై గత కొన్ని రోజులుగా నెగటివ్‌ ప్రచారం చేస్తున్న సోషల్‌ మీడియా మాధ్యమాలకు, యూట్యూబ్‌ ఛానెల్స్ కి ఆయన లీగల్‌ నోటీసులు పంపించారు. మోహన్‌బాబు నటించిన `సన్‌ ఆఫ్‌ ఇండియా`(Son of India Movie) చిత్రం శుక్రవారం విడుదలైంది. అంతకుముందు ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అయితే సోషల్‌ మీడియాలో మోహన్‌బాబు వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని, మోహన్‌బాబుని టార్గెట్‌ చేస్తూ నెగటివ్‌ ప్రచారం చేస్తున్నారని తాజాగా యూట్యూబ్‌ ఛాన్సెల్స్ కి, సోషల్‌ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ నిర్వహకులకు తెలిపారు మోహన్‌బాబు టీమ్‌. 

మంచు విష్ణుకి చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీస్‌ తోపాటు ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ కంపెనీల తరఫున శేష్‌ కేఎంఆర్‌ ఆయా మాధ్యమాలకు లీగల్‌ నోటీసులు పంపించారు. ఏపీ టికెట్ల విషయంలోనూ, అలాగే దీనిపై కొందరు పెద్దలు చర్చల విషయంలోనూ మోహన్‌బాబుని టార్గెట్ చేస్తూ తప్పుడు పోస్ట్ లు పెడుతున్నారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ లేనంతగా గత కొన్ని రోజులుగా తమపై విష ప్రచారం జరుగుతుందని తెలిపారు. మోహన్‌బాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా ట్రోల్స్ , మీమ్స్ పెడుతున్నారని, దీంతో మీమ్స్ పేజీల అడ్మిన్‌లకు, అకౌంట్‌ దారులకు, పోస్టింగ్‌కి కారణమైన మెయిన్‌ సోషల్‌ మీడియా మాధ్యమాలను మోహన్‌బాబు టీమ్‌ నుంచి హెచ్చరికలు పంపించారు. 

Scroll to load tweet…

తన సినిమా `సన్‌ ఆఫ్‌ ఇండియా`పై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారనే విషయాన్ని ఈ లీగల్‌ నోటీస్‌లో పేర్కొన్నారు. అంతేకాదు ఇలాంటి మళ్లీ జరిగితే, తమపై మళ్లీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే రూ.10కోట్ల దావా వేస్తామని కూడా హెచ్చరించడం విశేషం. ఇదిలా ఉంటే మోహన్‌బాబు హీరోగా నటించిన `సన్‌ఆఫ్‌ ఇండియా` చిత్రం శుక్రవారం విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంటోంది. డైమండ్‌ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ప్రగ్యా జైశ్వాల్‌, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషించారు. మంచు విష్ణు నిర్మించారు.