ఎమ్ఎమ్ కీరవాణి కొడుకు హీరోగా..!
టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుల్లో ఎమ్ఎమ్ కీరవాణి ఒకరు. దాదాపు రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం అందిస్తుంటారు. ఆయన పెద్ద కుమారుడు కాల భైరవ సింగర్ గా పరిచయమయ్యాడు. సంగీత దర్శకుడిగా కూడా పని చేస్తున్నాడు.
టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకుల్లో ఎమ్ఎమ్ కీరవాణి ఒకరు. దాదాపు రాజమౌళి డైరెక్ట్ చేసే సినిమాలన్నింటికీ ఆయనే సంగీతం అందిస్తుంటారు. ఆయన పెద్ద కుమారుడు కాల భైరవ సింగర్ గా పరిచయమయ్యాడు.
సంగీత దర్శకుడిగా కూడా పని చేస్తున్నాడు. ఇప్పుడు కీరవాణి రెండో కుమారుడు సింహా కోడూరి హీరోగా పరిచయం కావడానికి సిద్ధమవుతున్నాడు. ఓ కాన్సెప్ట్ బేస్డ్ ఫిలింతో సింహా కోడూరిని హీరోగా పరిచయం చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.
గతంలో సుకుమార్ డైరెక్ట్ చేసిన 'రంగస్థలం' సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశాడు సింహా కోడూరి. ఇప్పుడు హీరోగా పరిచయం చేయడానికి కావాల్సిన అన్ని పనులు పూర్తయ్యాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికార ప్రకటన చేయనున్నారు.