`జై భీమ్` సినిమాకి ఆస్కార్ పక్కా.. ఎమ్మెల్యే సీతక్క ప్రశంసలు.. సూర్య ట్వీట్
సూర్య హీరోగా నటించిన `జైభీమ్` సినిమా పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్లో విడుదలై ప్రశంసలందుకుంటుంది. తాజాగా తెలంగాణ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. ఏకంగా ఆస్కార్ అంటూ ప్రశంసలు కురిపించడం విశేషం.
హీరో సూర్య(Suriya) నటించిన `జై భీమ్` (Jai Bhim) సినిమా ప్రశంసలందుకుంటోంది. ప్రాంతాలకు, భాషలకు అతీతంగా ఈ సినిమాకి ప్రశంసలు దక్కుతున్నాయి. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి భారీ వ్యూస్ దక్కాయి. అంతేకాదు రేటింగ్ పరంగానూ సంచలనం సృష్టించింది. పాపులర్ రేటింగ్ సైట్ ఐఎండీబీలో అత్యధిక రేటింగ్తో నెంబర్ వన్గా నిలిచింది. మరోవైపు ఈ సినిమాకి వివాదాలు వెంటాడుతున్నాయి. కొన్నిపార్టీల నేతలు వివాదాలు సృష్టిస్తున్నాయి. సూర్యని కొడితే లక్ష రూపాయలు ఇస్తామంటూ ప్రకటించి దుమారం సృష్టించారు. మరోవైపు సీపీఎం లాంటి వాపపక్ష పార్టీలు సూర్యని, చిత్ర బృందాన్ని అభినందిస్తున్నారు.
అందులో భాగంగా తెలంగాణకి చెందిన ఎమ్మెల్యే కూడా సూర్యపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క)(Seethakka) సూర్యని, సినిమాని అభినందిస్తూ ట్వీట్ చేశారు. `Jai Bhim సినిమా ఆస్కార్(Oscar Award) బరిలో నిలిచి అవార్డు సాధిస్తుందని ఆశిస్తున్నా. చిత్ర బృందానికి ముందస్తుగా నా అభినందనలు` అని సీతక్క పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె ట్వీట్ వైరల్ అవుతున్న నేపథ్యంలో సీతక్క ట్వీట్ కి హీరో Suriya స్పందించారు. ఆమెకి కృతజ్ఞతలు చెబుతూ రిప్లై ఇచ్చాడు. `కృతజ్ఞతలు మేడం. మా చిత్ర యూనిట్నుంచి మీకు ధన్యవాదాలు` అని పేర్కొన్నాడు.
ఇక సూర్య హీరోగా నటించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. లిజో మోల్ జోస్ సినతల్లిగా, మణికందన్ ప్రధాన పాత్రలలో నటించిన `జై భీమ్` చిత్రం ఇటీవల అమెజాన్ ప్రైమ్లో విడుదలైంది. అన్ని వర్గాల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్లు కాదని నిరూపించిన మూవీ `జై భీమ్`. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది.
ఈ సినిమా హాలీవుడ్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. ఐఎండిబిలో టాప్ 250 సినిమాల జాబితాలో మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఐఎండీబీ మొదటి స్థానంలో ఉన్న కల్ట్ క్లాసిక్ `ది షాషాంక్ రిడంప్షన్` ను వెనక్కు నెట్టింది. ఈ సినిమా 9.6 రేటింగ్ తో అగ్ర స్థానంలో నిలిచింది. ఫ్రాంక్ డారాబోంట్ `ది షాశాంక్ రిడెంప్షన్` 9.3 రేటింగ్తో రెండవ స్థానంలో ఉండగా, ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోల క్లాసిక్ `ది గాడ్ ఫాదర్` 9.2 రేటింగ్తో మూడవ స్థానంలో నిలిచింది. జర్నలిస్ట్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్య నిర్మించిన విషయం తెలిసిందే.
మరోవైపు ఈ సినిమాని వివాదాలు వెంటాడుతున్నాయి. `జై భీమ్` సినిమా మీద వన్నియర్ అనే సామాజిక వర్గానికి చెందిన నేతలు విరుచుకు పడుతున్నారు. తమ వర్గాన్ని కించపరిచిన నటుడు సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయిలు బహుమానాన్ని ప్రకటించి సంచలనం సృష్టించారు పీఎంకే నేతలు. `జై భీమ్` సినిమాలో చాలా సన్నివేశాల్లో వన్నియర్ వర్గాన్ని కావాలనే అవమానించారంటూ పీఎంకే నేతల ఆరోపణలు చేస్తున్నారు. తమని కించపరిచారని ఆరోపిస్తూ 5 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని కూడా జై భీమ్ హీరో, నిర్మాత అయిన సూర్యకు వన్నియార్ సంగం నోటీసు జారీ చేసింది.
ఇదే వివాదం ఫై నటుడు సూర్యకి మాజీ కేంద్రమంత్రి పీఎంకే ముఖ్య నేత అన్బుమణి ఓ లేఖ కూడా రాశారని తెలుస్తుంది. ఈ లేఖపై సూర్య స్పందిస్తూ, తమకు దళితులపై జరుగుతున్న ఘటనలకు న్యాయం జరగాలనే ఉద్దేశం మాత్రమే ఉందని, అంతేకాని తమ సినిమా ద్వారా ఏ వర్గాన్ని కించపరచడం తమ ఉద్దేశం కాదని ఆయన వివరణ ఇచ్చారు. అయినా వివాదం తగ్గలేదు. పీఎంకే నేతలు మరో అడుగు ముందుకేశారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తొలగించాలని పీఎంకే పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ వివాదంలో నటుడు సూర్యకి మద్దుతుగా సీపీఎం లాంటి కొన్ని పార్టీలు, దళిత, గిరిజన సంఘాలు నిలుస్తున్నాయి. ఈ విషయం మీద సూర్య కూడా వామపక్షాలకు లేఖ రాశారు. ఇదిలా ఉంటే సినిమాలోని బాధితురాలు సినతల్లి అయిన రియల్ లైఫ్ సినతల్లి పార్వతి అమ్మాన్ కు పది లక్షలు విరాళంగా సూర్య ఇవ్వడం విశేషం.
also read: ట్రెండింగ్లో జస్టీస్ కె చంద్రు.. గూగుల్ సెర్చ్లోనూ టాప్.. `జై భీమ్` సినిమా ఎంత పనిచేసింది..