ఒకప్పటి సూపర్‌ స్టార్‌ మిథున్‌ చక్రవర్తి కొడుకు మీమో చక్రవర్తి తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఆయన తెలుగులో పవన్‌, ప్రభాస్‌ వంటి వారితో కలిసి నటించాలని ఉందని తెలిపారు.     

మిథున్‌ చక్రవర్తి ఒకప్పుడు సూపర్‌ స్టార్‌గా రాణించిన నటుడు. బాలీవుడ్‌ని తనదైన నటన, డాన్సులతో ఉర్రూతలూగించిన హీరో. కొన్నేళ్లపాటు బాలీవుడ్‌ శాషించిన ఆయన ఇప్పుడు ఒకటి అర సినిమాలకు పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వారసుడు స్పీడు పెంచుతున్నారు.

మిథున్‌ చక్రవరి కొడుకు మిమో చక్రవర్తి తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన `నేనెక్కడున్నా` అనే సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఇందులో ఎయిర్‌ టెల్‌ ఫేమ్‌ సషా చెత్రి హీరోయిన్‌గా నటించింది. మాధవ్‌ కోదాడ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని కేబీఆర్‌ సమర్పణలో శ్యాం ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ ఈ నెల 28న విడుదల కాబోతుంది. 

పవన్‌, ప్రభాస్‌ అంటే ఇష్టం..

ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆయన టాలీవుడ్‌ పై ప్రశంసలు కురిపించారు. తన ఫాదర్‌ లాగానే తాను కూడా రాణించాలని భావిస్తున్నట్టు తెలిపారు. తెలుగులో పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌ అంటే ఇష్టమని, తమిళంలో విజయ్‌, రజనీకాంత్‌ ఫేవరేట్‌ అని, ఇక్కడి సినిమాలు చూస్తూ తాను పెరిగినట్టు తెలిపారు.

ఇప్పుడు సౌత్‌లోకి `నేనెక్కడున్నా` మూవీతో ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. తాను తెలుగులో విలన్‌ రోల్స్ చేయాలని ఉందని తెలిపారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగిందని, ఇక్కడ టాలెంటెడ్‌ పీపుల్స్ ఉన్నారని, ఇక్కడ తాను నటుడిగా రాణించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. 

నాన్న మిథున్‌ చక్రవర్తి సలహా ఇదే..

తన తండ్రి మిథున్‌ చక్రవర్తి గురించి చెబుతూ, ఏ పని చేసినా 100 పర్సెంట్ నిజాయతీగా చేయమని నాన్న చెబుతుంటారు. తాను చాలా పేదరికం నుంచి, ఫుట్‌పాత్‌పై పడుకున్న పరిస్థితి నుంచి సూపర్‌ స్టార్‌గా ఎదిగారు. ఇప్పుడు తానుకు గోల్డెన్‌ స్ఫూన్‌ ఉన్నా, కింది స్థాయి నుంచి రావాలని, డౌన్‌ టూ ఎర్త్ ఉండాలని, అన్ని రకాల అనుభవాలు ఫేస్‌ చేయాలని చెబుతుంటారు.

అది నాకు బాగా నచ్చుతుందని తెలిపారు. నటుడిగా మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా నిజాయతీగా ఉండమని చెప్పారు. ఒకవేళ ఏదైనా పని చేయకూడదని అనిపిస్తే చేయవద్దని చెప్పారు. ఫాదర్ అండ్ సన్ కంటే స్నేహితులుగా ఉంటాం. బయట జనాలకు ఆయన సూపర్ స్టార్. కానీ, నాకు నాన్న. ప్రాక్టికల్ ఫాదర్ అని చెప్పాలి. 

`నేను తెలుగులో సినిమా చేస్తున్నానని తెలిసి ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. నువ్ 100 పర్సెంట్ ఇవ్వు' అని చెప్పారు. ఆర్టిస్టులకు, హీరో హీరోయిన్లకు భాష అనేది అడ్డు కాదు. కాకూడదు. ఇవాళ నేను తెలుగు సినిమా చేశా. రేపు ఆవకాశం వస్తే తమిళ, మలయాళ, పంజాబీ, భోజ్ పూరి సినిమాలు చేస్తాను. నాకు తెలుగు సినిమాలో అవకాశం రావడం పట్ల నాన్న సంతోషం వ్యక్తం చేశారు. భాష రాదని అసలు ఆలోచించవద్దని చెప్పారని తెలిపారు మిమో చక్రవర్తి. 

జర్నలిజం బేస్డ్ గా సాగే థ్రిల్లర్‌ `నేనెక్కడున్నా`..

ఇక తన `నేనెక్కడున్నా` మూవీ గురించి మాట్లాడుతూ, ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమా ఇది. కథ విన్నప్పుడు ఇందులో మహిళా సాధికారిత, మహిళా జర్నలిజం గురించి మాత్రమే చెప్పలేదు. ఇదొక సందేశాత్మక సినిమా. ఎట్ ద సేమ్ టైమ్, ఇదొక కంప్లీట్ పాప్ కార్న్ ఎంటర్‌టైనర్.

పాటలు, మంచి యాక్షన్ సీక్వెన్సులు, సన్నివేశాలు ఉన్నాయి. మహిళా జర్నలిస్టులు తమ కాళ్ళ మీద ఎందుకు నిలబడలేరు? అనే చక్కటి సందేశాన్ని ఇస్తుంది. నాకు తెలుగులో మంచి డెబ్యూ అవుతుందని అనుకున్నాను. 

దర్శకుడు మాధవ్ కోదాడ ఇంతకు ముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఇది ఆయన ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్. నాలుగేళ్లు ఈ సినిమా కోసం టైం ఇచ్చారు. సినిమా విడుదల వరకు వచ్చిందంటే కారణం ఆయనే. ఆయనకు కేబీఆర్ నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. ఇది థ్రిల్లర్ సినిమా కనుక ఎక్కువ సాంగ్స్ లేవు. నేను ఒక సాంగ్ చేశా.

స్టార్టింగ్ టు ఎండింగ్ థ్రిల్ ఇస్తుంది. ఎండింగ్ ట్విస్ట్ జట్కా ఇస్తుంది. ఫస్ట్ టైం నేను కథ విన్నప్పుడు ఆ ట్విస్ట్ ఊహించలేదు. థియేటర్లో ఆడియెన్స్ సర్‌ప్రైజ్‌ ఫీలవుతారు` అని తెలిపారు మిమో చక్రవర్తి. ఇక తనకు పవన్‌, ప్రభాస్‌, విజయ్‌, రజనీ ఇలా అందరు హీరోలతో సినిమాలు చేయాలని ఉంది. `ప్రస్తుతం విక్రమ్ భట్ దర్శకత్వంలో పదమూడేళ్ల క్రితం చేసిన హిట్ ఫిల్మ్ 'హంటెడ్' సీక్వెల్ చేస్తున్నా. నెట్‌ఫ్లిక్స్‌ కోసం 'ఖాకి' వెబ్ సిరీస్ సీజన్ 2 చేస్తున్నా` అని అన్నారు.  

read  more: ఇద్దరు తెలుగు సూపర్‌ స్టార్లకి తండ్రిగా రజనీకాంత్.. ఆయనకు కథ చెప్పిన డైరెక్టర్‌ డేర్‌కి మొక్కాలి

also read: సూర్యతో పెళ్లయ్యాక లింగ వివక్ష ఎదుర్కొన్నా.. జ్యోతిక సంచలన వ్యాఖ్యలు