మైండ్ స్కానింగ్ ట్రిక్ .. ‘ఇస్మార్ట్ శంకర్’కథలో క్లిక్
గత కొద్ది రోజులుగా డైరక్టర్ గా హిట్ కొట్టలేకపోతున్న పూరి జగన్నాథ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాని రీసెంట్ గా మొదలెట్టారు. అయితే ఈ సారి సైన్స్ ఫిక్షన్ జానర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
గత కొద్ది రోజులుగా డైరక్టర్ గా హిట్ కొట్టలేకపోతున్న పూరి జగన్నాథ్ మరో ఇంట్రస్టింగ్ సినిమాని రీసెంట్ గా మొదలెట్టారు. అయితే ఈ సారి సైన్స్ ఫిక్షన్ జానర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
తన స్టైల్కు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యే ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాను మొదైలైంది. డబుల్ దిమాక్ అనే ట్యాగ్ లైన్తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో పూరి కంబ్యాక్ అవుతారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. ఈ నేపధ్యంలో ఈ చిత్రం స్టోరీ లైన్ ఏమై ఉండవచ్చు అనేది సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అందుతున్న సమాచారం ప్రకారం..ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ నిధి అగర్వాల్ సైంటిస్ట్ గా కనిపించబోతోంది. ఆ విషయాన్ని నిధి స్వయంగా మీడియాకు తెలియచేసింది. ఈ మ్యాటర్ లీక్ ఈ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అనే విషయం ఖరారు అయింది. సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది. రామ్ క్యారెక్టర్ ను, అతడి మైండ్ సెట్ ను మార్చేసే శాస్త్రవేత్త పాత్రలో నిధి కనిపిస్తుందట.
రామ్ ని ఆమె ఎట్రాక్ట్ చేసి తన ప్రయోగాలకు వాడుకుంటుందిట. అందులో భాగంగా మైండ్ స్కానింగ్ ట్రిక్ ని ప్లే చేస్తుందని, దాంతో అది వికటించి డబుల్ థిమాక్ కు దారి తీస్తుందని చెప్తున్నారు. పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ తో సాగే మాస్ చిత్రం ఇదని తెలుస్తోంది.
ఈ సినిమాలో నిధీ అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీమతి లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మిస్తున్నారు. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మేలో విడుదల చేయాలనుకుంటున్నారు.