మేఘాపై కన్నేసిన టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారిపోయిన మేఘా గౌతమ్ మీనన్ హీరోయిన్ పై మన హీరోల టార్గెట్ 

ఒక్క సినిమా సినిమా కూడా రిలీజ్ కాదు. ఇంకా హిట్స్ ఖాతాలో పడలేదు. యాక్టింగ్ ఎలా చేస్తుందో తెలియదు. అప్పుడే సినిమాల మీద సినిమాలు సైన్ చేస్తోంది చెన్నై బ్యూటీ మెఘా ఆకాష్. ప్రస్తుతం ఈ అమ్మడు పేరు కోలీవుడ్ కంటే టాలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తోంది.

ప్రస్తుతం గౌతమ్ మీనన్, ధనుష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ మీనన్ హీరోయిన్స్ అంటే చాలా టాలెంటెడ్ హీరోయిన్స్ గా కనిపిస్తారు. సమంత, మంజిమా మోహన్ ఇలా పేరు అందుకున్న వారే. అందుకే ఇప్పుడు మేఘా అకాశ్ కి అలాంటి ఫేమ్ వస్తోంది. గౌతమ్ తో చేస్తోన్న సినిమా పూర్తి కాకముందే ఆమెను టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.

నితిన్ ,హను ల చిత్రంలో ఆమెను ఎంపిక చేసారానే న్యూస్ లీక్ కాగానే అఖిల్ అండ్ టీమ్ కూడా ఆమెనే హీరోయిన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారట. అఖిల్ తన రెండో చిత్రాన్ని మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో చేస్తోన్న సంగతి తెలిసిందే. జనవరీలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మేఘా ఆకాశ్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు టీటౌన్ లో ప్రచారం సాగుతోంది.