Asianet News TeluguAsianet News Telugu

రెండు రాష్ట్రాల్లో జిల్లాకో ఆక్సిజన్ బ్యాంక్.. కోవిడ్ రోగులకు చిరంజీవి ఆపన్నహస్తం

ఆక్సిజన్ కొరతతో తెలుగు రాష్ట్రాల్లోని కోవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆక్సిజన్‌ను అందజేస్తున్నా పెరుగుతున్న రోగులకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. 

megastar chiranjeevi key decision oxygen shortage in telugu states ksp
Author
Hyderabad, First Published May 20, 2021, 5:58 PM IST

ఆక్సిజన్ కొరతతో తెలుగు రాష్ట్రాల్లోని కోవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆక్సిజన్‌ను అందజేస్తున్నా పెరుగుతున్న రోగులకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు.

ఈ నేపథ్యంలో ప్రముఖ సినీనటుడు చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాకొక ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ బ్యాంకులు నెలకొల్పుతామని చిరు తెలిపారు.

వారం రోజుల్లో ప్రజలకు ఈ ఆక్సిజన్ బ్యాంకులు ప్రజలుకు అందుబాటులోకి రానున్నాయి. అభిమాన సంఘాల జిల్లా అధ్యక్షులకు ఈ ఆక్సిజన్ బ్యాంకుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు చిరు. 

కాగా, కొద్దిరోజుల  క్రితం దేశంలోని కరోనా పరిస్ధితులపై చిరంజీవి స్పందిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. జాగ్రత్తగా లేకపోతే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ ఎమోషనల్‌ వీడియోని పంచుకున్నారు. 

`క‌రోనా సెకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. చాలామంది వైర‌స్ బారిన ప‌డి ప్రాణాలతో పోరాడుతున్నారు. కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతోంది. వైర‌స్ వ‌ల్ల‌ మ‌న ఆత్మీయుల్ని కోల్పోతున్నామంటే గుండె త‌రుక్కుపోతోంది. ఈ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో మ‌ళ్లీ లాక్ డౌన్ వేశారు. క‌నీసం ఇప్పుడైనా అల‌క్ష్యం చేయ‌కుండా ఉండండి.

Also Read:చిరంజీవి సాయం నన్నెంతో ఆదుకుంది- పావలా శ్యామల

ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావొద్దు. అత్యవసరమై బయటికి వచ్చినప్పుడు తప్పకుండా  మాస్క్ ధ‌రించండి. వీలైతే డ‌బుల్ మాస్క్ ధ‌రించండి. లాక్ డౌన్ లో కూడా వ్యాక్సినేష‌న్ సాగుతోంది. రిజిస్ట్రేష‌న్ చేసుకుని అంద‌రూ వ్యాక్సినేష‌న్ తీస్కోండి. 

ఒకవేళ వ్యాక్సిన్‌ వేసుకున్నాక క‌రోనా పాజిటివ్ వ‌చ్చినా ప్ర‌భావం త‌క్కువ‌. కోవిడ్ పాజిటివ్ వ‌చ్చినా ప్యానిక్ అవ్వ‌కండి. వైర‌స్ కంటే మ‌న భ‌యమే మ‌న‌ల్ని ముందుగా చంపేస్తోంది. క‌రోనా పాజిటివ్ అని  తెలియానే ఐసోలేష‌న్ కి వెళ్లండి. మిమ్మ‌ల్ని మీరు వేరు చేసుకోండి. డాక్ట‌ర్ ని సంప్రదించండి. మందులు వాడండి.

ఊపిరి స‌మ‌స్య త‌లెత్తితే వెంట‌నే ఆస్ప‌త్రిలో చేరండి. క‌రోనా చికిత్స పొందిన త‌ర్వాత  నెల‌రోజుల్లో యాంటీబాడీస్ త‌యార‌వుతాయి. మీరు ప్లాస్మా దానం చేస్తే ఒక్కొక్క‌రు మ‌రో ఇద్ద‌రిని కాపాడిన వారు అవుతారు. ఈ విప‌త్తు స‌మ‌యంలో వీలైనంత మందికి ఈ విష‌యం చెప్పండి.

మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటే దేశాన్ని ర‌క్షించిన వాళ్లం అవుతాం. అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని సుర‌క్షితంగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటే మీ ఊరిని కాపాడిన వాళ్లవుతారు. తద్వారా రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడిన వారవుతారు` అని తెలిపారు చిరంజీవి. 

Follow Us:
Download App:
  • android
  • ios