సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ - గోపిచంద్ కాంబినేషనల్ లో వస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ గోపీచంద్ తండ్రితో ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు.
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ - గోపిచంద్ కాంబినేషనల్ లో పక్కాగా హిట్ కొట్టేందుకు వస్తున్న చిత్రం ‘పక్కా కమర్షియల్’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో గల శిల్పా కళా వేదికలో గ్రాండ్ గా జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన విధంగా పక్కా కమర్షియల్ మెగా మ్యాచో ఈవెంట్ కు మెగా స్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే ప్రముక నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజ్ కూడా హాజరై ఈవెంట్ ను సక్సెస్ చేశారు.
చీఫ్ గెస్ట్ గా హాజరైన చిరంజీవి వేదికపై మాట్లాడుతూ.. హీరో గోపీచంద్, దర్శకుడు మారుతీ గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. గోపీచంద్ తో నాకు చాలా దగ్గర సంబంధం ఉంది. గోపీచంద్ తండ్రి, దర్శకుడు టీ క్రిష్ణ ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒంగోళ్లో కలిశారు. ఆయన బీఏ చదువుతుండగా.. నేను ఇంటర్ చదువుతున్నాను. ఆ సమయంలో స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఆయన నాకు చాలా భరోసా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన స్ఫూర్తి నాకు ఓ ధైర్యంగా ఉంటుంది. ఎప్పుడూ మేం సినిమా చేసే అవకాశం రాలేదు. ఆయన దర్శకత్వం వహించిన రెవెల్యూషన్ చిత్రాలు అద్భుతంగా ఆడాయి. ఆ బంధంతోనే గోపీచంద్ తో రిలేషన్ కొనసాగుతోంది. గోపీ నటించిన సాహసం, చాణక్య వంటి వైవిధ్యమైన సినిమాలు నాకు చాలా నచ్చాయి.
అలాగే మారుతీ గురించి మాట్లాడుతూ.. దర్శకుడు మారుతీ నేను రాజకీయ ప్రవేశం సమయంలో పరిచయం అయ్యాడు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సందర్భంగా పార్టీ జెండాను గ్రాఫికల్ డిజైన్ చేసేందుకు ఓ అబ్బాయి కావాలని వెతకగా మారుతీ తగిలాడు. ఆ సమయంలో మారుతీని రెండు రోజులు మా ఇంట్లోనే ఉంచుకొని చాలా చర్చించాం. ఆ తర్వాత చిన్న వీడియోను షూట్ చేసుకొని రమ్మని చెప్పగా.. అద్భుతంగా చిత్రీకరించాడు. అప్పుడే ‘నీలో దర్శకుడు ఉన్నాడు’ అని చెప్పాను. మారుతీ సినిమాల్లో ‘ఈరోజుల్లో, భలే భలే మొగాడివో’ బాగా ఇష్టం. ప్రస్తుతం తీసిన పక్కా కమర్షియల్ మూవీ ఆడాలని ఆకాంక్షిస్తున్నాను.
అంతకు ముందు గోపీచంద్ మాట్లాడుతూ.. చిరంజీవి తన సినిమా ఫంక్షన్ కు గెస్ట్ గా రావడం ఆనందంగా ఉందన్నారు. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్నా ఎప్పుడూ ఆయన్ని కలిసే అవకాశం రాలేదని.. ఇప్పుడు మెగాస్టార్ ఆశీస్సులు తన సినిమాకు దక్కడం సంతోషమన్నారు. ఎప్పటి నుంచో జీఏ 2 బ్యానర్ లో పనిచేయాలని, అల్లు అరవింద్ నిర్వహణలో సినిమా చేయాలనే ఉండేది. అది ఇప్పటితో తీరింది. ఈవెంట్ వచ్చి బెస్ల్ చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అభిమానులు, ప్రేక్షకులకు ‘పక్కా కమర్షియల్’ను ఆదరిస్తారని ఆశిస్తున్నానన్నారు.
గోపీచంద్(Gopichand) ఇటీవల `సీటీమార్` చిత్రంతో విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం మంచి ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కేరాఫ్గా నిలుస్తున్న మారుతి దర్శకత్వంలో గోపీచంద్ `పక్కా కమర్షియల్`(pakka Commercial)లో నటించారు. ఈ చిత్రంలో హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna), పలు కీలక పాత్రల్లో సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటించారు. జూలై 1న రిలీజ్ కానున్న ఈ మూవీని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ కలిసి బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కుతుంది.
