ప్రీలుక్ చూస్తే మెగాస్టార్ కి కూడా ఆ సినిమానే గుర్తొచ్చిందట!
మెగా కుటుంబం నుంచి హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఈ రోజు (సోమవారం) ఉదయం రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటలకు నిర్వహించారు.
మెగా కుటుంబం నుంచి హీరో సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని ఈ రోజు (సోమవారం) ఉదయం రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రీలుక్ను విడుదల చేసింది. ‘పంజా వైష్ణవ్’ అంటూ ఆయన గెటప్ను రివీల్ చేసింది. ఇందులో వైష్ణవ్ మత్య్సకారుడి గెటప్లో సముద్రం ఒడ్డున కనిపించారు.
ఈ ప్రీ లుక్ చూసిన వారంతా.. ఈ సినిమాపై ‘రంగస్థలం’ ప్రభావం ఎక్కువ వున్నట్టుందంటూ కామెంట్స్ చేసారు. మరీ ముఖ్యంగా ‘రంగస్థలం’ సినిమా ప్రారంభోత్సవానికి ముందు ఎలాంటి పోస్టర్ విడుదల చేశారో… సేమ్ టు సేమ్ ఈసారీ అలాంటి పోస్టర్ విడుదల చేయటం ఆశ్చర్యపరిచింది. రామ్ చరణ్ ను వెనుక నుంచి చూపిస్తూ...‘రంగస్థలం’ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఇందులో పంజా వైష్ణవ్ తేజ్ సముద్రం ఒడ్డున పడవ పక్కన వున్నాడు. ఇక ఇదే విషయం చిరంజీవి సైతం పసిగట్టారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ''ఆదివారం విడుదలైన ప్రీలుక్ చూడగానే నాకు ‘రంగస్థలం’ గుర్తొచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. అదే విధంగా వైష్ణవ్ కూడా మంచి హిట్ అందుకుంటాడని ఆశిస్తున్నాను’' అన్నారు.
అలాగే ఇక్కడ మరో విషయం.. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ తప్ప ‘రంగస్థలం’ సినిమాకు పనిచేసిన టీమ్ అంతా ఈ సినిమాకు పని చేస్తోంది. సుకుమార్ స్క్రిప్టు రాస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వాస్తవిక ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇక ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా ఇంతకు ముందు సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రానికి రైటర్గా కూడా పనిచేశారు.
దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా, శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహించనున్నారు. అలాగే ‘రంగస్థలం’ ఫేమ్ రామకృష్ణ మౌనిక ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను చూసుకుంటుండగా… నవీన్ నూలి ఎడిటర్ గా చేస్తున్నారు.
వైష్ణవ్ తేజ్ మూవీ ఓపెనింగ్ లో మెగాహీరోలు!