పంజా వైష్ణవ్ తేజ్ నెక్ట్స్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. మాస్ అవతార్ లో దుమ్ములేపుతున్న యంగ్ హీరో!
యంగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) తన నాలుగోవ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వివరాలనూ వెల్లడించారు.
‘ఉప్పెన’తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు మెగా హీరో, పంజా వైష్ణవ్ తేజ్. తొలిచిత్రంతోనే ఆడియెన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకునన్నాడు. కానీ తదుపరి రెండు చిత్రాలు ఇచ్చిన రిజల్ట్ తో కాస్తా వెనకబడ్డాడు. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్ పంజా విసిరేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా (PVT04) రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు. అలాగే ఓ సాలిడ్ గ్లింప్స్ ను కూడా వదిలారు.
ఈ చిత్రంలో పంజా వైష్ణవ్ తేజ్ - క్రేజీ హీరోయిన్ శ్రీ లీలా (Sree Leela) జంటగా నటిస్తున్నారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. డెబ్యూ దర్శకుడిగా ఎన్ శ్రీకాంత్ రెడ్డి పరిచయం కాబోతున్నారు. వైష్ణవ్ తేజ్ ను మాస్ అవతారంతో చూపించబోతుండటం విశేషం. ప్రస్తుతం చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. నిర్మాతలు ఎస్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ చిత్ర సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు.
న్యూ ఇయర్ స్పెషల్ గా ఈ చిత్రానికి సంభందించి ఓ ప్రచార చిత్రాన్ని చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. దాంతో పాటు రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 29న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. మూవీ పోస్టర్ ఆక్టుకుంటోంది. తీగల కంచెకు బయట అస్పష్టంగా కనిపిస్తూ వైష్ణవ్ తేజ్ నిలుచున్న తీరు, మరో వైపు కంచె తగలబడుతున్న వైనం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గ్లింప్స్ లోనూ మాస్ ఎలివేషన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. వైష్ణవ్ తేజ్ సరికొత్త మాస్ అవతారంతో అలరించబోతున్నారు. పూరి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుందని మేకర్స్ తెలుపుతున్నారు. త్వరలోనే చిత్రం టైటిల్, అలాగే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.