Asianet News TeluguAsianet News Telugu

ప్రముఖ ఓటీటీ సంస్థకు ‘మెగా 154’ స్ట్రీమింగ్ రైట్స్.. భారీ ధరకు ఒప్పందం.!

మెగా స్టార్ చిరంజీవి వరుసపెట్టి చిత్రాలను విడుదల చేస్తున్నారు. చిరంజీవి - బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మెగా154’(Mega 154). అయితే ఈ చిత్రం ఓటీటీ రైట్స్ భారీ ధరకు విక్రయించినట్టుగా తెలుస్తోంది. 

Mega 154 Movie streaming rights to a leading OTT company, contract at a huge price!
Author
First Published Sep 27, 2022, 9:48 PM IST


వరుసపెట్టి చిత్రాలను రిలీజ్ కు సిద్ధంగా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. చివరిగా ‘ఆచార్య’ చిత్రంతో ప్రేక్షకుల మందుకు వచ్చిన బాస్ అంతగా మెప్పించలేకపోయారు. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్ పై మరింత శ్రద్ధ పెట్టారు. ఈ క్రమంలో వచ్చే నెలలో ‘గాడ్ ఫాదర్’ (Godfather) చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిరు లైనప్ లో ఉన్న మూవీ ‘మెగా 154’పై క్రేజీ అప్డేట్ అందింది. ఇప్పటికే ఈ మూవీ చిత్రీకరణ కొనసాగుతుండగా.. మధ్య మధ్యలో సినిమాపై అప్డేట్స్ అందిస్తూనే ఉన్నారు. ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్ డేట్ ను కూడా కన్ఫమ్ చేసిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా చిత్ర ఓటీటీ రైట్స్ ను కూడా ప్రముఖ ఓటీటీ సంస్థకు విక్రయించినట్టు తెలుస్తోంది. 

తాజాగా సమాచారం ప్రకారం.. ‘మెగా 154’ చిత్ర పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ (Netflix)) దక్కించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకు విక్రయించినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.50 కోట్లకు అమ్ముడుపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కూడా కీలక పాత్రలో నటిస్తుండటం, మరోవైపు చిరంజీవి ఊరమాస్ లుక్ లో కనిపిస్తుండటంతో వింటేజ్ చిరు కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అనధికారికంగా దర్శకుడు, చిరు కూడా చిత్ర టైటిల్ ను  ‘వాల్తేరు వీరయ్య’గా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మరీ టైటిల్ నే కన్ఫమ్ చేస్తారా లేదా మరేదైనా పరిశీలిస్తున్నారన్నది తెలియాల్సి ఉంది. 

‘మెగా 154’లో చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. కేఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. గ్లామర్ బ్యూటీ, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి 14న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 05న ‘గాడ్ ఫాదర్’తో మెగాస్టార్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’,‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios