కోలివుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమా సంక్రాంతి కాకుండా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు ఊరుకుంటారా థియేటర్ల వద్ద అజిత్ కటౌట్లు వాటికి పాలాభిషేకాలు చేశారు
కోలివుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమా సంక్రాంతి కాకుండా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమ అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే అభిమానులు ఊరుకుంటారా థియేటర్ల వద్ద అజిత్ కటౌట్లు వాటికి పాలాభిషేకాలు చేశారు.
సినిమాకి హిట్ టాక్ రావడంతో పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. తమిళనాడులో తిరుకొవిళూర్ లో అభిమానులు ఏర్పాటు చేసిన అజిత్ భారీ కటౌట్ ఒక్కసారిగా కూలిపడింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఒకేసారి ఎక్కువమంది అభిమానులు కటౌట్ పైకి ఎక్కి పాలాభిషేకం చేయడానికి ప్రయత్నించగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయాలపాలైన అజిత్ అభిమానులను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్లు సమాచారం.
Dear @CMOTamilNadu - Please Ban tall cutouts for all movie stars throughout tamilnadu . This should never ever repeat - Prayers to family of the injured !! #Viswasam pic.twitter.com/Z60VvXiCnv
— Prashanth Rangaswamy (@itisprashanth) January 10, 2019
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 11, 2019, 3:38 PM IST