‘దసరా’ నుంచి మాసియెస్ట్ సాంగ్.. ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అంటూ నాటు స్టెప్పులతో దుమ్ములేపుతున్న నాని.!
నేచురల్ స్టార్ నాని ఊరమాస్ లుక్ లో అలరించబోతున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘దసరా’ (Dasara). ఈ మూవీ నుంచి తాజాగా మాసియెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ విడుదలైంది. మాస్ బీట్స్ కు, నాని నాటు స్టెప్పులకు సాంగ్ ఇంటర్నెట్ లో దూసుకుపోతోంది.
విభిన్న కథలతో నేచురల్ స్టార్ నాని అభిమానులను అలరిస్తున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’, ‘అంటే సుందరానికీ’తో ఆకట్టుకున్న నాని ప్రస్తుతం ఊరమాస్ లుక్ లో, మాస్ యాక్షన్ ఫిల్మ్ గా ‘దసరా’ (Dasara)తో అలరించేందుకు సిద్ధంగా అవుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. నాని కేరీర్ లోనే భారీ స్థాయిలో రూపొందుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా ‘దసరా’ నుంచి ఫస్ట్ సింగిల్ గా మాసీయెస్ట్ లోకల్ స్ట్రీట్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు.
తాజాగా విడుదలైన ‘ధూమ్ ధామ్ ధోస్తాన్’ (Dhoom Dhaam Dhosthaan) లిరికల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. కొద్దిసేపటి క్రితమే వచ్చిన ఈ మాస్ సాంగ్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది. సాధారణ తెలంగాణ-శైలి జానపదంగా సాంగ్ ప్రారంభమవుతుంది. తన బ్యాండ్ బృందానికి మద్యం బాటిల్ను అందిస్తూ.. వారు వాయించే మాస్ బీట్ కు నాటు స్టెప్పులేస్తూ దుమ్ములేపాడు. లిరిక్స్ తెలంగాణ ప్రజల జీవన శైలిని తెలిపేవిగా ఉన్నాయి. పక్కా మాస్ పంక్తులతో ఫస్ట్ సింగిల్ జోష్ ను పెంచుతోంది.
నాని క్యారెక్టర్ కూడా షాకింగ్ ఉంది. ఈ రేంజ్ లో నాని మేకోవర్ అవడం ఇదే తొలిసారి అని చెప్పొచ్చు. అలాతే నాని, అతని బ్యాచ్ డైనమిక్ నృత్యాలతో బొగ్గు గనులలో దుమ్ము రేపారు. సంతోష్ నారాయణ్ ఈ పాటను కంపోజ్ చేయగా, రాహుల్ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోర దాసు లక్ష్మి అద్భుతంగా పాడారు. తెలంగాణా స్టైల్లో కాసర్ల శ్యామ్ ఈ పాటను రాశారు.
ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు షెడ్యూళ్లు పూర్తి చేసుకోగా.. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నట్టు తెలుస్తోంది. నాని - కీర్తి సురేష్ (Keerthy Suresh) జంటగా నటిస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. గోదావరి మైన్స్ ప్రాంత పరిసర ప్రాంతాల్లోని ఆసక్తికరమైన గ్రామీణ కథగా సినిమా రూపొందుతోంది. దసరా పండగ కానుకగా దసరా రోజున ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ టైటిల్ తో విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ లిరికిల్ సాంగ్ తో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. 2023లో సినిమాను గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది.