Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్.. సెకండ్ షెడ్యూల్ కు సిద్ధంగా మారుతీ - ప్రభాస్ సినిమా.. ఎలాంటి అప్డేట్ లేకుండానే పూర్తి చేస్తున్నారే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మారుతీ కాంబినేషన్ లో వస్తున్న సినిమాను  సైలెంట్ పూర్తి చేస్తున్నారు. ఒక్కో షెడ్యూల్ ను కంప్లీ చేస్తూ వెళ్తున్నారు. ప్రస్తుతం యూనిట్ నెక్ట్స్ షెడ్యూల్ కు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
 

Maruti Prabhas movie ready for second schedule, Complete without any update!
Author
First Published Dec 4, 2022, 11:20 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ‘సలార్’,‘ప్రాజెక్ట్ కే’ చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే బాలీవుడ్ లో ‘ఆదిపురుష్’ చిత్రాన్ని కూడా పూర్తి చేశారు. ఈ క్రమంలోనే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతీ (Maruti)తోనూ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ మూవీని ఏ రకంగానూ అనౌన్స్ చేయలేదు. అప్డేట్ కూడా ఇవ్వలేదు. సైలెంట్ గా సినిమాను పూర్తి చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఉండటంతో.. మారుతీ డైరెక్షన్ లో కండీషన్స్ మేరకు నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ప్రభాస్ - మారుతీ సైలెంట్ గా సినిమాను పూర్తి చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేయగా.. తాజాగా రెండో షెడ్యూల్ కు కూడా యూనిట్ సిద్ధంగా ఉందంట. డిసెంబర్ 8 నుంచి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. చాలా కాలం తర్వాత గ్రాఫిక్స్ లేకుండా.. చాలా నేచురల్ గా ప్రభాస్ సినిమా రూపుదిద్దుకుంటుండటం ఆసక్తికరంగా మారింది.  ఇప్పటి వరకు ఎలాంటి అఫిషీయల్ అప్డేట్ రాలేదు.. అఫిషీయల్ అనౌన్స్ మెంట్ కూడా లేదు. కనీసం లీక్స్ కూడా జరగకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. 

ఈ చిత్రం  ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి అవ్వగా.. సెకండ్ షెడ్యూల్  కోసం 10 కోట్ల రూపాయలతో భారీ థియేటర్ సెట్ వేస్తున్నారు. ఈ ఖరీదైన సెట్‌లో సినిమా షూటింగ్ ప్రధానంగా సాగుతుందని సమాచారం. చిత్ర యూనిట్‌ ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఈ భారీ థియేట‌ర్ సెట్‌ను నిర్మించిన‌ట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చిత్ర యూనిట్ పై, హీరోయిన్లపై, కనీసం నిర్మాత, బ్యానర్ పైనా అప్డేట్ ఇవ్వకుండా సినిమా చేయాల్సిన అవసరం ఎంటనేది కూడా చర్చనీయాంశంగా మారుతోంది.

ఈ ప్రాజెక్ట్ లో ప్రభాస్ చాలా ఈజీ క్యారెక్టర్ లో కనిపిస్తారని తెలుస్తోంది.  వరుసగా యాక్షన్ ఫిల్మ్స్ లో నటిస్తున్న ప్రభాస్ కాస్తా కామెడీ వెర్షన్ లో ప్రేక్షకులను, అభిమానులను అలరించాలని భావించడంతో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కినట్టు సమాచారం. ఇందులో హీరోయిన్లుగా నిధి అగర్వాల్ (Niddhi Agerwal), మాళవికా మోహనన్ (Malavika Mohanan) నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ‘రాజా డిలక్స్’ అనే టైటిట్ ను ఖరారు చేశారని సమాచారం.  

Follow Us:
Download App:
  • android
  • ios