Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ తెలుగు 8 లో కొత్త ట్విస్టులు: మణికంఠ కార్నర్? గిల్లి జోలపాడుతున్న యష్మి

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో రోజుకో సినిమా చూపిస్తున్నారు కంటెస్టెంట్లు. తాజా ఎపిసోడ్ లో మణికంఠను అందరు కార్నర్ చేసినట్టుగా ఫీల్ అయ్యాడు. కాంతార టీమ్ కు కొత్త చీఫ్ కోసం హోరా హోరిగా పోటీపడుతున్నారు.

Manikanta Cornered: Yashmi s Support Amidst Drama in Bigg Boss Telugu Season 8 JMS
Author
First Published Oct 2, 2024, 11:49 PM IST | Last Updated Oct 2, 2024, 11:49 PM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజుకో రకంగా కనిపిస్తోంది. రోజుకో సినిమా చూపిస్తున్నారు కంటెస్టెంట్లు. ఎప్పుడు ఎవరు ఎలా ఉంటారో తెలియక ఆడియన్స్ కూడా కన్ ఫ్యూజ్ లోపడిపోతున్నారు. ఇప్పటికప్పుడు క్లోజ్ గా ఉంటారు.. అప్పుడే సీరియస్ గా గొడవపెట్టుకుంటారు. ఇక తాజా ఎపిసోడ్ లో మణికంఠను అందరు కార్నర్ చేసినట్టుగా ఫీల్ అయ్యాడు. కాంతార టీమ్ కు కొత్త చీఫ్ కోసం హోరా హోరిగా పోటీపడుతున్నారు. మరి చీఫ్ గా ఎవరు కాబోతున్నారన్నిది చూడాలి. 

మణింకఠ సూపర్ మచ్చా.. పృధ్విరాజ్ లేడీ గెటప్.. 

ఉదయం లేవగానే కలర్ కలర్ వాట్ కలర్ గేమ్ ఆడించారు బిగ్ బాస్. ఈగేమ్ లో కాంతార టీమ్ విన్ అవ్వడంతో  వారికోసం బిగ్ బాస్ చాక్లెట్స్ పంపించారు. ఇక గేమ్ లో ఫన్నీ ఫన్నీ సీన్స్ దర్శనం ఇచ్చాయి. ఇక ఈ గేమ్ లో ముందుగా దిగిన మణికంఠ ఓడిపోవడంతో.. అతనికి మంచి మాస్ సాంగ్ కు డాన్స్ చేయాలని టాస్క్ ఇచ్చారు. ఇక ఆ పాటకు సూపర్ డాన్స్ చేశాడు మణి. ఇక ఆతరువాత మణితో కలిసి నైనిక, యష్మి కూడా విడి విడిగా డాన్స్ చేశారు. 

ఇక ఈ గేమ్ లో ఓడిపోయిన పృధ్వి రాజ్ చేత లేడీ గెటప్ వేయించి సరదాగా క్యాట్ వాక్ చేయించింది ప్రేరణ. ఈ గెటప్ లో అతన్ని చూసి అంతా సరదాగా నవ్వుకున్నారు. ఇక ఈగేమ్ లో ఓడిపోయిన నబిల్ చేత.. స్పూన్ తో బట్ లో వాటర్ నింపాల్సిందిగా బిగ్ బాస్ ఆదేశం ఇచ్చారు. ఇలా ఫన్ గేమ్ తో ఉదయాన్నేవారిల ఉత్సాహాన్ని నింపారు బిగ్ బాస్. 

Manikanta Cornered: Yashmi s Support Amidst Drama in Bigg Boss Telugu Season 8 JMS

యష్మిని ఏడిపించిన పృధ్వి. 

ఇక శక్తి టీమ్ లో చీఫ్ కంటెండెన్ ఎంచుకునే బాధ్యతను వారికి ఇవ్వగా.. ఈ విషయంలో వారిమధ్య కాస్త వాదోపవాదాలు జరిగాయి. మణింకఠను నువ్వు అన్నది కరెక్ట్ కాదు కదా.. అలాంటిప్పుడు నువ్వు చీఫ్ గా ఉండి నడిపించలేవు అంటూ పృధ్వి అన్న మాటలకు యష్మి ఏడుపు స్టార్ట్  చేసింది. దాంత పృధ్వి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. 

ఇక ఆతరువత మళ్లీ వచ్చి ఏడుస్తూ.. యష్మిని హగ్ చేసకున్నాడు. ఇద్దరు ఎమోషనల్ అవ్వడంతో టీమ్ లో ప్రాబ్లమ్ తిరిపోయింది. అయితే తమ టీమ్ నుంచి చీఫ్ కంటెండర్ గా పృధ్విని  అనౌన్స్ చేశాడు నిఖిల్. ఇక తారువాత.. ఇంకో కంటెండర్ కాంపిటేషన్ కోసం పప్పీ టాస్క్ ను పెట్టాడు బిగ్ బాస్. ఈటాస్క్ లోనే అందరి మధ్య గోడవ స్టార్ట్ అయ్యింది. 

కార్నర్ అవుతున్న మణికంఠ, 

ఈ పప్పీ టాస్క్ లో మణింకఠ, యష్మి ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలంటేు.. ఫస్ట్ సంచాలక్ గా ఉన్న పృద్వీ యష్మికి ఇచ్చేశాడు. దాంతో మణికంఠను పృధ్వికి మధ్య వాగ్వాదం జరిగింది. ఆతరువాత మణికంఠ సంచాలక్ గా ఉండగా.. యష్మి, ప్రేరణ మధ్య ప్రేరణనుసపోర్ట్ చేసి.. యష్మిని పక్కు తప్పించాడుమణికంఠ. ఈ విసయంలో కూడా ఇద్దరి మధ్య పెద్ద యుద్దమే జరిగింది. 

ఆతరువాత జరిగిన చిన్న గొడ పెద్ద గాలి వానలా మారింది. అందులో సీత, నైనిక, విష్ణు ప్రియ అటుయష్మి. అంతా కలిసి మణికంఠను టార్గెట్ చేస్తూ.. విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. దాంతో అతను తాను ఒంటరి అయిపోయానని ఫీల్ అయ్యాడు. ఈ విషయంలో అందరు కూడా అదే అంటున్నారు. నువ్వు కార్నర్ అవుతున్నావని ఫీల్ అవుతున్నావు. కాని అందరు నిన్నే సపోర్ట్ చేస్తున్నారంటూ గట్టిగట్టిగా అరిచారు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.


మస్త్ షేడ్స్ చూపిస్తున్న యష్మి.

ఈ విషయంలో అందరితో మణింకఠకు వాగ్వాదం జరిగింది. కాగా చాలాసేపు ఒంటరిగా ఉన్న మణికంఠ. ఆతరువాత వచ్చి గేమ్ చూస్తూ బాధపడుతుంటాడు.ఇక ఆ బాధను చూసి వెంటనే దగ్గరకు వచ్చి మణికంఠను ఓదార్చుతుంది యష్మి. ఈ విషయంలో యష్మిలో మస్తు షేడ్స్ కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కావడంతోలేదు.

అప్పటిదాకామణికంఠపై రకరకాలుగా ఫైర్ అయ్యి.. నోరు పారేసుకున్న యష్మి.. ఆతరువాత అతన్ని ఓదార్చుతు కనిపించింది. ఆతరువాత సీత కలుగజేసుకుని. మణింకఠకు విషయం చెపుతూ...ఏడవద్దు అంటూ వారించే ప్రయత్నం చేసింది. ఇలా బిగ్ బాస్ హౌస్ లో రకరకాల మార్పులు.. అద్భుతాలు జరుగుతుంది. మరి ఈవారం చీఫ్ గా ఎవరు సెలక్ట్ అవుతారోన నెక్ట్స్ ఎపిసోడ్ లో తెలుస్తుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios