కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో 38 ఏళ్ల క్రితం `నాయకుడు` సినిమా వచ్చింది. అయితే ఈ మూవీ సెట్ కావడం వెనుక క్రేజీస్టోరీ ఉందట. ఆ విషయాన్ని మణిరత్నం బయటపెట్టారు
కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో 38 ఏళ్ల క్రితం `నాయకుడు`(1987) చిత్రం వచ్చింది. అది అప్పట్లో సంచలనాలు సృష్టించిన మూవీ. ఇండియన్ మూవీస్లో దీన్నొక `గాడ్ ఫాదర్`గా భావిస్తారు. చాలా గ్యాంగ్ స్టర్ మూవీస్ కి ఇదొక రిఫరెన్స్ గా నిలిచింది.
ఫస్ట్ టైమ్ ఈ మూవీతో కమల్ హాసన్, మణిరత్నం కలిసి పనిచేశారు. కానీ ఆ తర్వాత వీరిద్దరు సినిమా చేయలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత మళ్లీ `థగ్ లైఫ్` చిత్రంతో కలిశారు. మరో సంచలనానికి తెరలేపారు.
`నాయకుడు` సినిమా వెనుక క్రేజీ స్టోరీ
`నాయకుడు` సినిమా చేయడం వెనుక ఒక ఆసక్తికర స్టోరీ ఉంది. ఆ విషయాన్ని మణిరత్నం వెల్లడించారు. ఇటీవల `థగ్ లైఫ్` ప్రెస్ మీట్ హైదరాబాద్లో జరిగింది. ఇందులో కమల్ హాసన్తోపాటు, మణిరత్నం, శింబు, త్రిష, అభిరామి, సుహాసిని, తనికెళ్ల భరణి, నాజర్, తెలుగులో సినిమాని విడుదల చేస్తున్న నిర్మాత సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇందులో మణిరత్నం మాట్లాడుతూ, `నాయకుడు` సినిమా ఎలా స్టార్ట్ అయ్యిందో తెలిపారు. `మౌనరాగం` సినిమా తర్వాత మణిరత్నం ఖాళీగా ఉన్నారట. స్క్రిప్ట్ లపై వర్క్ చేస్తున్నారు.
కమల్ హాసన్ ఆఫర్ని రిజెక్ట్ చేసిన మణిరత్నం
ఆ సమయంలో నిర్మాత ముక్తా శ్రీనివాసన్ వచ్చి మణిరత్నం చేతిలో ఒక కవర్ పెట్టాడు. అందులో పెద్ద అమౌంట్ ఉంది. అదే సమయంలో అందులో ఒక క్యాసెట్ కూడా ఉందట. అదొక హిందీ సినిమా. దాన్ని రీమేక్ చేయాలని, అది చూసి స్క్రిప్ట్ ప్రిపేర్ చేయాలని ఆ నిర్మాత మణిరత్నంని కోరారు.
కానీ తాను రీమేక్ చేయను అని, ఈ సినిమా చేయడానికి తాను సరైన వ్యక్తిని కాదని చెప్పి రిజెక్ట్ చేశాడట. మణిరత్నం మాట వినడం లేదు, దీంతో ఆయన్ని మరుసటి రోజు కమల్ హాసన్ వద్దకు తీసుకెళ్లాడట ఆ నిర్మాత.
`నాయకుడు` మూవీ సెట్ అయ్యింది ఇలానే
అప్పుడు మొదటిసారి కమల్ని కలిశాడు మణిరత్నం. అప్పటికే కమల్ పెద్ద స్టార్ హీరో. కమల్ హాసన్ కూడా మణిరత్నంకి అదే చెప్పాడు. కానీ కమల్కి కూడా నో చెప్పాడు మణిరత్నం.
దీంతో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావ్ అని అడిగాడట కమల్. అప్పుడు తన వద్ద రెండు స్క్రిప్ట్ లు ఉన్నాయని, ఆ రెండూ వినిపించాడట. అందులో `నాయకుడు` స్క్రిప్ట్ నచ్చింది. అలా `నాయకుడు` సినిమా వచ్చింది, అదొక చరిత్రగా మారిపోయిందన్నారు మణిరత్నం.
38 ఏళ్ల తర్వాత `థగ్ లైఫ్` విషయంలోనూ సేమ్ స్టోరీ
అంతేకాదు ఇప్పుడు `థగ్ లైఫ్` విషయంలోనూ సేమ్ అదే జరిగిందన్నారు మణిరత్నం. కమల్ కాల్ చేసి ఇద్దరం కలిసి ఒక సినిమా చేద్దామని చెప్పారు. అలా ఈ మూవీ జర్నీప్రారంభమైంది అని మణిరత్నం పేర్కొన్నారు. `ఇన్నేళ్ల తర్వాత కమల్తో సెకండ్ సినిమా అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఆయనతో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్ పీరియెన్స్.
ఆయన `నాయకుడు` సినిమా సమయంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. నేను డైరెక్టర్ కాకముందు నుంచి ఆయన్ని చూస్తున్నాను. ఆయనలో ఏ మార్పు లేదు. దర్శకుడు ఏమనుకుంటున్నాడో దాన్ని అర్థం చేసుకొని సపోర్ట్ చేసే హీరో కమల్` అని తెలిపారు మణిరత్నం. `థగ్ లైఫ్` మూవీ జూన్ 5న విడుదల కాబోతుంది.