కేఏ పాల్లా నేను పాడలేకపోతున్నా: మంచు మనోజ్
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ తాజాగా ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ని ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్ ఓ పాట పాడారు.
అది రాజకీయాలకు సంబంధించిన పాట. ప్రస్తుతం కేఏ పాల్ ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్ధులను నిలబెడుతున్నాడు. తమ పార్టీ కచ్చితంగా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో 'నేను మీ ఊర్లన్నీ వస్తాను.. రాయలసీమ, గుంటూరు వస్తాను' అంటూ క్రిస్టియన్ పాటల స్టైల్ లో ఓ రాజకీయ పాట పాడారు. ఈ పాట విన్న రామ్ గోపాల్ వర్మ నవ్వుతున్న ఎమోజీలను పెట్టి వీడియోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఇది చూసిన మంచు మనోజ్ తను ఎంతగా ప్రాక్టీస్ చేస్తున్నా.. ఆ పాట రావడం లేదని కామెంట్ పెట్టాడు. ''సార్ ఎపిక్ వీడియో. నేను ఆ పాటను ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ ఆ ప్రపంచనేత(కేఏ పాల్) పాడినట్లుగా నేను పాడలేకపోతున్నాను'' అంటూ సోషల్ మీడియాలో కామెంట్ పెట్టారు. ఇది చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Sirrrrr .... epic videoooo 😂 I’m practising it sir but not able to get it right like the World Leader 🙏🏻 https://t.co/8whNG8D0as
— Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) January 23, 2019