సూపర్ స్టార్ మహేష్ బాబుకోసం రంగంలోకి దిగబోతున్న మలయాళ యంగ్ స్టార్
సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం.. మలయాళ యంగ్ స్టార్ ను రంగంలోకి దించబోతున్నాడు మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మహేష్ తో పోరాటానికి దించబోతున్నారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్.. కాంబో సినిమా సెట్స్ ఎక్కడానికి రెడీగా ఉంది. ఈ నెలలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా త్రివిక్రమ్ సన్నాహాలు మొదలుపెట్టేశాడు కూడా. ఇక ఈ మూవీలో ప్రతినాయకుడి పాత్రక కోసం చాలా కాలంగా కొంత మంది పేర్లను పరిశీలిస్తున్నారు మహేష్- త్రివిక్రమ్. ఇక రీసెంట్ గా ఓ పేరును ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాలో మహేష్ కు ఆపోజిట్ గా మలయాళ యంగ్ స్టార్ రోషన్ మాథ్యూను రంగంలోకి దింపబోతున్నట్టు తెలుస్తోంది.
మాలీవుడ్ నటుడిగా రోషన్ మాథ్యూ కు సౌత్ లో మంచి పేరు ఉంది. ఆయన ఎవరో కాదు..రీసెంట్ గా రిలీజ్ అయిన చియాన్ విక్రమ్ కోబ్రా సినిమాలో మెయిన్ విలన్ గా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. మలయాళంలో నటుడిగా ఆయన కెరియర్ 2015లోనే మొదలైంది. చాలా తక్కువ టైమ్ లోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు రోషన్.
ఇక కోబ్రా సినిమాతోనే తమిళ, తెలుగు ఆడియన్స్ కు పరిచయం అయిన రోషన్.. టాలీవుడ్ లో మహేష్ బాబు కంటే ముందు నానీ సినిమాతో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నాని దసరా సినిమాలోను రోషన్ మాథ్యూ ఒక కీలక పాత్రను పోషిస్తున్నాడు. అలాంటి ఆయనను మహేశ్ మూవీలో విలన్ పాత్రకి త్రివిక్రమ్ తీసుకోవడంతో.. రోషన్ టాలీవుడ్ లో పాతుకుపోవడం ఖాయం అంటున్నారు. అయితే ఈ విషయం అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు.. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక త్రివిక్రమ్ సారధ్యంలో తెరకెక్కనున్న ఈసినిమాలో సూపర్ స్టార్ మహేష్ సరసన హీరయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ఇప్పటికే నటీనటుల ఎంపిక జరిగిపోయింది. షూటింగ్ ఓపెనింగ్ కూడా పూజా కార్యక్రమాలతో చేసేశారు. మొన్నటి వరకూ ఫారెన్ టూర్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు.. రీసెంట్ గా ఇండియా వచ్చారు. రెగ్యూలర్ షూటింగ్ కు రెడీ అవుతున్నారు.