Asianet News TeluguAsianet News Telugu

#Yatra2:'యాత్ర 2' బడ్జెట్ అంతా?...బిజినెస్ మాత్రం

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని, కాంగ్రెస్ హైకమాండ్ అభిష్టాన్ని వ్యతిరేకంగా ఆయన చేపట్టిన పాదయాత్రను ఇది వివరిస్తుంది. 

Mahi V Raghav Yatra 2 budget is 50 Cr jsp
Author
First Published Feb 6, 2024, 9:46 AM IST


మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన 'యాత్ర 2' సినిమా ఈ వారం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. యాత్ర మొదటి భాగం 2019లో  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ మూవీని విడుదల చేశారు. ఆ మూవీని తీసిన విధానం చాలా మందికి నచ్చింది. జగన్ విజయంలో ఈ మూవీ కూడా ఉపయోగపడిందని అంటారు.  ఇప్పుడు మళ్లీ ఎన్నికల సమయానికి జగన్ కథగా యాత్ర 2 తెరకెక్కించి రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రీసెంట్ గా విడుదల చేయగా.. చాలా మందిని ఆకట్టుకుంది. ఈ  సీక్వెల్ ఫిబ్రవరి 8 న విడుదల కానుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి ఎంత బడ్జెట్ పెట్టారు...ఎంత బిజినెస్ అవుతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా బడ్జెట్ 40 నుంచి 50 కోట్లు మధ్య అని చెబుతున్నారు. ఈ బడ్జెట్‌లో చాలా భాగం స్టార్ క్యాస్ట్ కోసమే ఖర్చు పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 10 నిమిషాల 8 సెకన్లు. అయితే రికవరీ ఏ మేరకు ఉండబోతోంది. ఈ చిత్రం రెగ్యులర్ ఎంటర్‌టైనర్ కాదు . రాజకీయ వాగ్దానాలు, ఎజెండాలతో లోడ్ చేసి ఉంటుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని, కాంగ్రెస్ హైకమాండ్ అభిష్టాన్ని వ్యతిరేకంగా ఆయన చేపట్టిన పాదయాత్రను ఇది వివరిస్తుంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై వైఎస్సార్సీపీ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

అయితే కమర్షియల్ గా చూస్తే ... యాత్ర 2 సినిమాకు సంబంధించి బిజినెస్ ఇంకా పూర్తి కాలేదని  టాక్ . ఇంకా  థియేట్రికల్‌, నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా జరగలేదంటున్నారు. ఓటిటి బిజినెస్ చర్చల దశలోనే ఉంది. ఈ క్రమంలో థియేట్రికల్ పరంగా సొంతంగా రిలీజ్ చేసే ఆలోచనల్లో ఉన్నారని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

దర్శకుడు చెప్పేదాని ప్రకారం 2009 నుంచి 2019 వరకు జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘనల సమాహారంగా ఈ సినిమా వుటుందట. యథార్థ సంఘటనలే అయినప్పటికీ జనాలను ఆకట్టుకునేలా తెరకెక్కించేందుకు కొంత ఫిక్షన్ కూడా యాడ్ చేస్తామని స్వయంగా చెప్పాడు దర్శకుడు.
 
  ఈ సినిమాకు వైసీపీ వర్గాల నుండి కూడా భారీ స్పందన ఉండడం మాత్రం ఖచ్చితమేనని చెప్పవచ్చు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి వైఎస్ రాజశేఖర్ రెడ్డిగా నటించిన యాత్ర సినిమా అప్పట్లో మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు యాత్ర-2 లో తమిళ హీరో జీవా వైఎస్ జగన్ గా నటిస్తున్నారు. యాత్ర-2 చిత్రం నుంచి ట్రైలర్ కొద్దిరోజుల కిందటే రిలీజ్ అయింది. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios