మహేష్బాబు `సర్కారు వారి పాట` ఫస్ట్ నోటీస్ ఇచ్చేది అప్పుడే ?
ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న`సర్కారు వారి పాట` యూనిట్లో చలనం వచ్చింది. ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ని రంగంలోకి దించబోతున్నారు.
`ఆర్ఆర్ఆర్` ప్రమోషన్ ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్లు ఇస్తూ జోరు పెంచారు. ఇతర యంగ్ హీరోలు తమ సినిమా అప్ డేట్లు ఇస్తూ తమ సినిమాలపై అందరిలోని అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్న`సర్కారు వారి పాట` యూనిట్లో చలనం వచ్చింది. ఎట్టకేలకు సూపర్ స్టార్ మహేష్ని రంగంలోకి దించబోతున్నారు. ` సినిమాకి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నారు. ఈ నెల(జులై) 31న ఫస్ట్ నోటీస్ పేరుతో మహేష్ ఫస్ట్ లుక్ని విడుదల చేయబోతున్నారు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి రెండు పోస్టర్లు విడుదల కాగా,అందులో మొదట మహేష్ హెడ్ బ్యాక్ సైడ్లో ప్రీ లుక్గా చూపించారు. మరోసారి చేతిలో కీస్ పట్టుకుని ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు మహేష్ ఫస్ట్ లుక్ని పంచుకోబోతున్నారు. ఓ రకంగా ఫ్రెండ్ షిప్ డే గిఫ్ట్ గా ఇది షేర్ చేయబోతున్నట్టు టాక్. ఇక ఈ చిత్రానికి `గీతగోవిందం` ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. కీర్తిసురేష్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.