సినీ కార్మికులను ఆదుకుంటామని తెలిపింది. దీంతో టాలీవుడ్‌కి పూర్వ వైభవం రాబోతుందని చిత్ర పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.  

తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమకి వరాలు కురిపించింది. హడావుడిగా థియేటర్ల అనుమతికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సినీ కార్మికులను ఆదుకుంటామని తెలిపింది. దీంతో టాలీవుడ్‌కి పూర్వ వైభవం రాబోతుందని చిత్ర పరిశ్రమ పెద్దలు భావిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, రామ్‌చరణ్ వంటి వారు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు హీరో మహేష్‌బాబు, దర్శకులు రాజమౌళి, పూరీ జగన్నాథ్‌, నిర్మాతలు స్పందించి ధన్యవాదాలు చెబుతున్నారు. మహేష్‌బాబు స్పందిస్తూ, `తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద ఊరట. పెద్ద తెరపై సినిమాలు చూడటం, పరిశ్రమలో పనిచేస్తున్న లక్షలాది మంది జీవితాలను నిలబెట్టడం అనే సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడానికి సహాయక చర్యలు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎంకి, కేటీఆర్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు` అని తెలిపారు. 

Scroll to load tweet…

రాజమౌళి స్పందిస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించిన చాలా అవసరమైన సహాయక చర్యలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సంతోషిస్తుంది. కచ్చితంగా మళ్ళీ పురోగతి మార్గంలో పరిశ్రమ నడుస్తుందని నమ్ముతున్నా. ఈ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్‌కి ధన్యవాదాలు` అని పేర్కొన్నారు. 

Scroll to load tweet…

అలాగే పూరీ జగన్నాథ్‌ సైతం కీలకమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వీరితోపాటు గీతా ఆర్ట్స్, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Scroll to load tweet…
Scroll to load tweet…